చంద్రబాబుది మహానాడు కాదు మాయనాడు, వెన్నుపోటు నాడు.. వెల్లంపల్లి శ్రీనివాసరావు

చంద్రబాబుది మహానాడు కాదు మాయనాడు, వెన్నుపోటు నాడు అని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు.

Bukka Sumabala$ | Asianet News | Updated : May 29 2020, 04:20 PM
Share this Video

చంద్రబాబుది మహానాడు కాదు మాయనాడు, వెన్నుపోటు నాడు అని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. శుక్రవారం బ్రాహ్మణ వీధి లోని దేవదాయ శాఖ మంత్రి క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో  మంత్రి పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ  గత ప్రభుత్వంలో ఎన్నికల మేనిఫెస్టోను వెబ్‌సైట్‌ నుంచి టీడీపీ తొలగించిందని కానీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏడాది కాలంలోనే మేనిఫెస్టోలో పేర్కొన్న 90శాతం హామీలను నెరవేర్చారని తెలిపారు. పేద ప్రజలకు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఒక వరమని.. పేదలందరికీ వైద్యం అందించాలన్నదే సీఎం జగన్‌ ధ్యేయమని మంత్రి పేర్కొన్నారు. గతంలో ప్రతీ దాంట్లో చంద్రబాబు దోపిడీకి పాల్పడ్డారు  రేపటి తో జగన్ పాలన వన్ ఇయర్ అవుతున్న సందర్భంగా మంత్రి నగర ప్రజల తరఫున సీఎం జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

Related Video