పోలీస్ స్టేషన్ ముందే వేటకొడవళ్లతో దాడి.. తలలు పగిలి నరకం...
కర్నూలు జిల్లా, తుగ్గలి మండలం, జొన్నగిరి గ్రామంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అన్నదమ్ముల మధ్య పొలం విషయమై గొడవలొచ్చి జొన్నగిరి పోలీస్ స్టేషన్ లో ఇద్దరూ ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో ఇరువర్గాల బంధువులు అక్కడికి రావడంతో అన్నదమ్ముల మధ్య మాటా మాటా పెరిగి ఘర్షణలకు దారి తీసింది. ఇరువర్గాల బంధువులు వేటకొడవళ్లతో ఒకరిపై ఒకరు స్టేషన్ దగ్గరే దాడికి తెగబడ్డారు. ఈ ఘర్షణలో ఆరుగురికి తీవ్ర గాయాలు, ఒకరి పరిస్థితి విషమించడంతో కర్నూలు ఆస్పత్రికి తరలించారు. జొన్నగిరి లో పరిస్థితి అదుపు చేయడానికి సిఐ ఆదినారాయణ రెడ్డి అదనపు పోలీసులను రంగంలోకి దించారు.