విశాఖకు చేరుకున్న మిడతల దండు?!
విశాఖ జిల్లా, కసింకోట మండలంలో మిడతలు కలకలం రేపుతున్నాయి.
విశాఖ జిల్లా, కసింకోట మండలంలో మిడతలు కలకలం రేపుతున్నాయి. గోకి వాని పాలెంలోని జీడి కొమ్మపై మిడతాలు దండు కనిపించడంతో గ్రామస్తులు భయాందోళనలో మునిగిపోయారు. ఓ జీడి మామిడి తోటలోకి వచ్చిన దండు క్షణాల్లో మొక్కల ఆకులను తినేశాయి. అయితే ఇవి స్థానికంగా కనిపించే మిడతలేనని భయంలేదని హార్టి కల్చరల్ అధికారులు చెప్పడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.