బురదనీటిలో మంచమేసుకుని పడుకుని... ఏలూరు యువకుడి వినూత్న నిరసన
ఏలూరు : కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ముందుగానే దెబ్బతినివున్న రోడ్లు వర్షపు నీటితో మరింత దెబ్బతిన్నాయి.
ఏలూరు : కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ముందుగానే దెబ్బతినివున్న రోడ్లు వర్షపు నీటితో మరింత దెబ్బతిన్నాయి. ఇలా ఏలూరు నగరంలోనూ వర్షపు నీటితో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా తయారయ్యింది. దీంతో ఓ యువకుడు రోడ్ల దుస్థితి పాలకులకు తెలియజేసేందుకు వినూత్నంగా నిరసన తెలిపాడు. వర్షపు నీటితో పూర్తిగా గుంతలమయమైన రోడ్డుపై మంచం వేసుకుని పడుకొని నిరసన తెలిపాడు. ఇలా ఏలూరు తూర్పు వీధి గంగానమ్మ గుడి వద్ద యువకుడు ఆందోళనకు దిగడంతో కైకలూరు వైపు వెళ్ళే వాహనాలు ఆగిపోయాయి. కొద్దిసేపు యువకుడు ఇలాగే బురద నీటిలో మంచంపై పడుకుని ఆందోళన చేపట్టాడు