Asianet News TeluguAsianet News Telugu

టిడిపి ఆఫీస్ వద్ద భారీ పేలుడు... ముగ్గురికి తీవ్ర గాయాలు, భయానక పరిస్థితి

మంగళగిరి : తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

మంగళగిరి : తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.ఇటీవలే అన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి వైసిపిని వీడిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఇవాళ చంద్రబాబు నాయుడు సమక్షంలో టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా టిడిపి శ్రేణులు మంగళగిరి కార్యాలయం వద్ద భారీఎత్తున టపాసులు కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ క్రమంలోనే నిప్పురవ్వలు టపాసులపై పడటంతో అన్ని ఒకేసారి పేలాయి. దీంతో పెద్ద శబ్దంతో భారీ పేలుడు సంభవించింది. ఈ మంటల్లో చిక్కుని ముగ్గరు కార్యకర్తలు గాయపడగా వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.