Asianet News TeluguAsianet News Telugu

ప్రత్యేక హోదాపై చర్చ జగన్ విజమేనన్న వైసిపి నేతలు... మరి ఇప్పేడేమంటారు?: సిపిఐ రామకృష్ణ చురకలు

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చొరవతోనే ప్రత్యేకహోదా అంశంపై కేంద్ర ప్రభుత్వం దిగివచ్చిందని సంబరాలు చేసుకున్న వైసీపీ నేతలు ఎజెండా నుండి దీన్ని తొలగించడంపై ఏం సమాదానం చెబుతారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. 

First Published Feb 13, 2022, 10:02 AM IST | Last Updated Feb 13, 2022, 10:02 AM IST

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చొరవతోనే ప్రత్యేకహోదా అంశంపై కేంద్ర ప్రభుత్వం దిగివచ్చిందని సంబరాలు చేసుకున్న వైసీపీ నేతలు ఎజెండా నుండి దీన్ని తొలగించడంపై ఏం సమాదానం చెబుతారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. ఇప్పటికైనా అనవసరపు అంశాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రత్యేక హోదాపై రాష్ట్రంలోని అన్ని పార్టీలతో తక్షణమే ఒక సమావేశం ఏర్పాటు చేయాలని... అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకు వెళ్లి ప్రధాని వద్దే తేల్చుకోవాలని సూచించారు. కేంద్రం ఏపీకి పదేపదే చేస్తున్న అన్యాయంపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వామపక్ష పార్టీల నిరసన సభలు, సదస్సులకు పిలుపునిచ్చిందని... ఫిబ్రవరి 19న విజయవాడలో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు రామకృష్ణ ప్రకటించారు.