
ప్రొక్లెయిన్తో మృతదేహం తరలింపు : కమిషనర్, శానిటరీ ఇన్స్పెక్టర్లపై సస్పెన్షన్ వేటు
శ్రీకాకుళం జిల్లా పలాసలో 70యేల్ల వృద్ధుడు చనిపోతే కరోనా లక్షణాలు ఉన్నాయని చెప్పి మృతదేహాన్ని ప్రొక్లెయిన్ తో ఈడ్చుకుంటు వెళ్లిన సంఘటన కలకలం రేపింది.
శ్రీకాకుళం జిల్లా పలాసలో 70యేల్ల వృద్ధుడు చనిపోతే కరోనా లక్షణాలు ఉన్నాయని చెప్పి మృతదేహాన్ని ప్రొక్లెయిన్ తో ఈడ్చుకుంటు వెళ్లిన సంఘటన కలకలం రేపింది. దీనిమీద ఏపీ ముఖ్యమంత్రి జగన్.. ఈ సంఘటన తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని మానవత్వాన్ని చూపాల్సిన సమయంలో కొంతమంది వ్యవహరించిన తీరు బాధించింది. ఇలాంటి ఘటనలు మరెక్కడా పునరావృతం కాకూడదు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకతప్పదు అని ట్విట్టవర్ వేదికగా స్పందించారు. ఈ ఘటనలో మున్సిపల్ కమిషనర్, శానిటరీ ఇన్స్పెక్టర్పై సస్పెన్షన్ వేటు పడింది.
Add Asianetnews Telugu as a Preferred Source
