Asianet News TeluguAsianet News Telugu

అమరావతి : కార్యాలయాల తరలింపుపై ప్రభుత్వానికి హై కోర్టు షాక్

కర్నూలుకు కార్యాలయాల తరలింపుపై ఏపీ హైకోర్టులో విచారణ ముగిసింది. 

కర్నూలుకు కార్యాలయాల తరలింపుపై ఏపీ హైకోర్టులో విచారణ ముగిసింది. దీనికి సంబంధించిన అఫిడవిట్ దాఖలు చేయాలని  హై కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. వాదనలకు సంబంధించిన డాక్యుమెంట్లు ఇవ్వాలని పిటిషనర్లను హై కోర్టు ఆదేశించింది. డాక్యుమెంట్లు లేకుండా ఓరల్ ఆర్గ్యుమెంట్ చేయడం సరికాదనన్న హైకోర్టు చీవాట్లు వేసింది. ఏ కారణాలతో ఆఫీసులను తరలిస్తున్నారో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును 11వ తేదీకి  హై కోర్టు వాయిదా వేసింది.