తెలంగాణ శాసన సభ బుధవారానికి వాయిదా పడింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఆమోదం పొందింది. తొలి రోజే అధికార, ప్రతిపక్షాలతో సభ అట్టుడికింది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రలు భట్టి విక్రమార్క్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్లు, బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, హరీశ్ రావుల మధ్య వాడిగా వేడిగా చర్చ జరిగింది.