Assembly Election Results 2022: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలోనే ఉత్తరాఖండ్ లో విచిత్రంగా.. రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీల ముఖ్యమంత్రి అభ్యర్థులు ఓటమిని చవిచూశారు.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రైతు ఉద్యమం ప్రభావం కన్పించలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఏడాది పాటు ఆందోళన చేసిన రైతు సంఘాలకు విపక్షాలు మద్దతిచ్చిన విషయం తెలిసిందే.
పంజాబ్ ప్రజలు అద్భుత విజయాన్ని ఇచ్చారని డిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. పంజాబ్ రాష్ట్ర ఎన్నికల ఫలితాల సరళిపై ఆయన గురువారం నాడు వ్యాఖ్యానించారు.
తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి నేతలు తమ స్వరాన్ని పెంచేందుకు దోహదపడే అవకాశాలు లేకపోలేదు. జీ 23 నేతలు పార్టీ నాయకత్వంపై తమ గళాన్ని పెంచే చాన్స్ ఉంది.
దేశంలో కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాల్లోనే అధికారానికి పరిమితమైంది. ఛత్తీస్ఘడ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ అధికారంలో ఉంది. 2004 లో దేశంలో మూడు రాష్ట్రాల్లోనే అధికారంలో ఉంది.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకుపోతోంది. 4 రాష్ట్రాల్లో అధికారం చేపట్టేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఉత్తరాఖండ్, గోవాలో కూడా బీజేపీ అధికారంలో ఉన్నా ఆ పార్టీల సీఎం అభ్యర్థులు వెనుకంజలో ఉన్నారు.
ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో గత మూడు నెలల నుంచి నెలకొన్న ఉత్కంఠకు నేడు తెరపడనుంది. ఏ రాష్ట్ర ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టబెట్టనున్నారో తెలియనుంది. ప్రస్తుతం ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో బీజేపీకి అధికార పార్టీగా ఉంది. ఒక్క రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది.
Assembly Election Results 2022: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో వెలువడనున్నాయి. ఉత్తరప్రదేశ్తో పాటు పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల భవితవ్యం తేలనున్నది. ఈ మేరకు ఎన్నిక సంఘం అన్ని ఏర్పాటు చేసింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభంకానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించనున్నారు. తర్వాత సభ వాయిదాపడనుంది. అనంతరం బీఏసీ సమావేశం జరుగుతుంది. ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలనే అంశంపై ఈ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. రెండో రోజు దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డికి ఉభయ సభలు సంతాపం తెలుపుతాయి. సంతాప తీర్మానం అనంతరం సమావేశం ముగుస్తుంది.
తెలంగాణలో పల్లెలన్నీ ప్రగథి పథంలో నడుస్తంటే నిధులు కేంద్రానివా? రాష్ట్రానివా? అన్న చర్చ అనవసరం అని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు.