Hyderabad: కేంద్ర మంత్రి, బీజేపీ నాయకులు జీ.కిషన్ రెడ్డి హైదరాబాద్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. యూసుఫ్ గూడ, జూబ్లీహిల్స్, అంబర్ పేటలో ప్రస్తుత పరిస్థితులను తెలుసుకునీ, అధికారులతో మాట్లాడి మురుగు కాల్వలు, మ్యాన్ హోల్స్ పొంగిపొర్లడంతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే ఆయన సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ సర్కారుపై విమర్శలు గుప్పించారు.