ప్రాణం తీసిన సెల్ఫీ మోజు: జలపాతంలో కొట్టుకుపోయిన యువతి
సెల్ఫీ మోజు ఓ యువతి నిండు ప్రాణాలను బలి తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా వంకమడుగు జలపాతానికి శివానీ అనే యువతి తన సోదరుడు శివాజీతో కలిసి సెల్ఫీ దిగుతుండగా ఇద్దరు అదుపుతప్పి నీటి ప్రవాహంలో పడిపోయారు
సెల్ఫీ మోజు ఓ యువతి నిండు ప్రాణాలను బలి తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా వంకమడుగు జలపాతానికి శివానీ అనే యువతి తన సోదరుడు శివాజీతో కలిసి సెల్ఫీ దిగుతుండగా ఇద్దరు అదుపుతప్పి నీటి ప్రవాహంలో పడిపోయారు.
ఆ సమయంలో నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో శివానీ కొట్టుకుపోయింది. దీనిని గమనించిన స్థానికులు శివాజీని రక్షించగా, శివానీ మాత్రం ప్రవాహంలో కొట్టుకుపోయింది. దీంతో ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.