బాలకృష్ణతో కలిసి సుహాసిని నామినేషన్
కూకట్పల్లి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని నామినేషన్ కు ముహూర్తం కుదిరింది. శనివారం ఉదయం 11.21 గంటలకు సుహాసిని నామినేషన్ దాఖలు చేయనున్నారు.
హైదరాబాద్: కూకట్పల్లి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని నామినేషన్ కు ముహూర్తం కుదిరింది. శనివారం ఉదయం 11.21 గంటలకు సుహాసిని నామినేషన్ దాఖలు చేయనున్నారు.
అంతకు ముందు ఉదయం 9గంటలకు బాబాయ్ బాలకృష్ణతో కలిసి ఎన్టీఆర్ ఘాట్లో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత సీఎం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు. అనంతరం 11.21 గంటలకు కూకట్పల్లిలో బాబాయ్ బాలయ్యతో కలిసి సుహాసిని నామినేషన్ వేయనున్నారు. బాలయ్యతోపాటు నందమూరి కుటుంబ సభ్యులు కూడా భారీ సంఖ్యలో హాజరుకానున్నారు.
ఈ నామినేషన్ కార్యక్రమానికి టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, శేరిలింగంపల్లి టీడీపీ అభ్యర్థి భవ్య ఆనంద ప్రసాద్ లతోపాటు పలువురు టీడీపీ, మహాకూటమి నేతలు హాజరుకానున్నట్లు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి
రంగంలోకి దిగిన సుహాసిని:టీడీపీ నేతలకు ఫోన్, సహకరించాలని విజ్ఞప్తి
అందుకే రాజకీయాల్లోకి వచ్చా, తండ్రిని తల్చుకొని కన్నీళ్లు పెట్టుకొన్న సుహాసిని
హరికృష్ణ సానుభూతి, ఎన్టీఆర్ ఛరిష్మా: టీడీపీ తురుపుముక్క సుహాసిని
నందమూరి సుహాసినీపై.. మిత్రపక్షం కాంగ్రెస్ తిరుగుబాటు
కూకట్పల్లి సుహాసినికి కేటాయింపు: బాబు వద్దకు పెద్దిరెడ్డి
మీడియా ముందుకు నందమూరి సుహాసిని
33 ఏళ్ల తర్వాత తెలంగాణలో నందమూరి ఫేటు ఎలా ఉందో, నాడు ఎన్టీఆర్...నేడు సుహాసిని
‘‘ఆ’’ సాయమే హరికృష్ణ కుమార్తె సుహసిని మనసు మార్చిందా..?
హరికృష్ణ కుమార్తెకే కూకట్ పల్లి టిక్కెట్, 17న సుహాసిని నామినేషన్
సుహాసిని కోసం జూ.ఎన్టీఆర్: ప్రచారానికి బాలయ్య, విజయశాంతి జోడి
చంద్రబాబుతో భేటీ: కూకట్పల్లి సీటు హరికృష్ణ కూతురు సుహాసినికే
తెరపైకి హరికృష్ణ కూతురి పేరు: కూకట్పల్లిపై ఉత్కంఠ
హరికృష్ణ కూతురు పోటీకి జూ.ఎన్టీఆర్ బ్రేక్
కూకట్పల్లి టీడీపీ అభ్యర్థిగా నందమూరి హరికృష్ణ కుమార్తె..?