హైద్రాబాద్లో ఐదేళ్ల పాపపై రేప్, హత్య: దోషికి మరణశిక్ష
ఐదేళ్ల పాపపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడికి రంగారెడ్డి జిల్లా కోర్టు మరణశిక్ష విధించింది.
హైదరాబాద్: ఐదేళ్ల పాపపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడికి రంగారెడ్డి జిల్లా కోర్టు మరణశిక్ష విధించింది.2017లో నార్సింగ్ లో ఐదేళ్లపాపపై అత్యాచారం చేసిన కేసును పోలీసులు సీరియస్ గా తీసుకొన్నారు. పాపను లేబర్ క్యాంప్ లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆ పాపను హత్య చేశాడు.
ఈ కేసును సైబరాబాద్ పోలీసులు సీరియస్ గా తీసుకొన్నారు. నిందితుడికి ఈ కేసుతో సంబంధం ఉందనే సాక్ష్యాలను కోర్టుకు సమర్పించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ట్రయల్స్ నిర్వహించారు.పాపపై అత్యాచారం చేసి హత్య చేసినట్టుగా పోలీసులు ఇచ్చిన సాక్ష్యాలతో కోర్టు నమ్మింది. దినేష్ ను దోషిగా తేల్చింది. దోషి దినేష్ కు మరణశిక్ష విధించింది కోర్టు
గతంలో కూడ అత్యాచారాలతో పాటు హత్యలు చేసిన దోషులకు రాష్ట్రంలో మరణశిక్షలు పడ్డాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మైనర్ విద్యార్ధులను హత్యచేసిన దోషికి మరణశిక్ష పడింది.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివాహితపై గ్యాంగ్ రేప్ నకు పాల్పడి హత్య చేసిన దోషులకు కూడ మరణశిక్షలు విధించింది కోర్టు. తాజాగా రంగారెడ్డి జిల్లా కోర్టు నార్సింగ్ ఘటనలో దోషికి మరణశిక్షను విధించింది.