మసాజ్ ముసుగులో గలీజ్ దందా... హైదరాబాద్ లో రెండు స్పా లపై పోలీసుల దాడి
హైదరాబాద్ లో రెండు స్పా సెంటర్లపై దాడులు నిర్వహించిన పోలీసులు తొమ్మిదిమంది సెక్స్ వర్కర్లు, నలుగురు నిర్వహకులను అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ : పేరుకే అవి మసాజ్, స్పా సెంటర్లు... అక్కడ జరిగేదంతా వ్యభిచారమే. అమ్మాయిలతో క్రాస్ మసాజ్ పేరిట కస్టమర్లను ఆకట్టుకుని వ్యభిచార దందా నిర్వహిస్తున్నాయి కొన్ని ముఠాలు. ఇలా హైదరాబాద్ బంజారాహిల్స్ ప్రాంతంలో వ్యభిచారం నిర్వహిస్తున్న రెండు స్పా సెంటర్లపై పోలీసులు దాడి చేసారు.
పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెం.12 లో నీలిమ, కార్తీక్ అనే ఇద్దరు హెవెన్ ఫ్యామిలీ స్పా నిర్వహిస్తున్నారు. ఈ స్పాలో మసాజ్ ముసుగులో వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఈ స్పా సెంటర్ పై నిఘా పెట్టిన పోలీసులు వ్యభిచారం జరుగుతున్నట్లు వచ్చిన సమాచారం నిజమేనని నిర్దారించుకున్నారు. దీంతో తాజాగా హెవెన్ ఫ్యామిలీ స్పాపై దాడిచేసిన పోలీసులు ఐదుగురు యువతులతో పాటు నిర్వహకులను అదుపులోకి తీసుకున్నారు. సెక్స్ వర్కర్లను పునరావాస కేంద్రానికి తరలించి నిర్వహకులపై కేసు నమోదు చేసి జైలుకు పంపారు.
Read More TS News: ఉపాధ్యాయురాలి కంట్లో కారం కొట్టి మంగళసూత్రం చోరీ చేసిన దొంగ
ఇక ఇదే బంజారాహిల్స్ రోడ్ నెం.12 లోని మరో స్పా లో కూడా వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. జ్యోతి బజాజ్, సయ్యద్ యూసుఫ్ నిర్వహిస్తున్న వెల్వెట్ స్పా పై దాడిచేసిన పోలీసులు నలుగురు అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. వారిని పునరావాస కేంద్రానికి తరలించారు. వీరితో వ్యభిచారం చేయిస్తున్న నిర్వహకులు జ్యోతి, సయ్యద్ లను మాత్రం అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.
ఐటీ ఉద్యోగులు, దనవంతులు ఎక్కువగా వుండే బంజారాహిల్స్, జూబిహిల్స్, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో భారీ హంగులతో స్పా సెంటర్లు ఏర్పాటుచేసి యదేచ్చగా వ్యభిచారం నిర్వహిస్తున్నాయి కొన్ని ముఠాలు. తరచూ పోలీసుల దాడులు జరుగుతున్నా స్పా, మసాజ్ సెంటర్ల పేరిట గలీజ్ దందా సాగుతూనే వుంది. హైటెక్ పద్దతుల్లో విటులను ఆకర్శిస్తూ గుట్టుగా వ్యభిచారం చేస్తున్నారు.