Asianet News TeluguAsianet News Telugu

పెళ్లికొడుకు ముందే పెళ్లి కూతురికి ముద్దిచ్చిన ప్రియుడు: వరుడికి ట్విస్టిచ్చిన వధువు

పెళ్లై ఊరేగింపు జరుగుతున్న సమయంలో నూతన వరుడి ముందే ప్రియుడు నవ వధువుకు ముద్దు పెట్టాడు.  ఆమెను తనకు అప్పగించాలని గొడవ చేశారు. ఈ విషయమై ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. 

lover kisses bride infront of groom in karimnagar district
Author
Karimnagar, First Published Aug 27, 2020, 10:29 AM IST

కరీంనగర్: పెళ్లై ఊరేగింపు జరుగుతున్న సమయంలో నూతన వరుడి ముందే ప్రియుడు నవ వధువుకు ముద్దు పెట్టాడు.  ఆమెను తనకు అప్పగించాలని గొడవ చేశారు. ఈ విషయమై ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. పరస్పరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకొన్నారు. ప్రియుడితోనే తాను ఉంటానని వధువు తేల్చి చెప్పింది. దీంతో వధువును వదిలేసి ఇరు కుటుంబాలు వదిలివెళ్లారు. వధువును పోలీసులు  స్వధార్ హోం కు తరలించారు.

పెళ్లికి ముందే ఓ యువతి వంశీ అనే యువకుడితో ప్రేమలో పడింది.  అయితే ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పిందో లేదో తెలియదు కానీ,తల్లిదండ్రులు కుదిర్చిన పెళ్లికి ఒప్పుకొంది.  దీంతో ఈ నెల 24వ తేదీ రాత్రి ఘనంగా యువతి పెళ్లి జరిపించారు. పెళ్లి జరిపించిన తర్వాతే  అసలు ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.

మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన ప్రవీణ్ కుమార్ కు హుజూరాబాద్ కు చెందిన దివ్య అనే యువతిని ఇచ్చి ఈ నెల 24వ తేదీన పెళ్లి జరిపించారు కుటుంబసభ్యులు. పెళ్లికి ముందే దివ్యకు, వంశీ అనే యువకుడికి మధ్య ప్రేమ వ్యవహరం సాగింది.

పెళ్లి తర్వాత గ్రామంలో ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమయంలోనే వధువు దివ్య ప్రియుడు వంశీ ఎంటరయ్యాడు. బాగా మద్యం సేవించిన వంశీ పెళ్లి ఊరేగింపు వద్దకు వచ్చాడు. కారులో ఉన్న వధువును కిందకు దింపాడు. అక్కడే ఆమెకు ముద్దు పెట్టుకొన్నాడు. 

దివ్యను తాను ప్రేమించానని గొడవ చేశాడు.  నీవు ఎలా పెళ్లి చేసుకొంటావని పెళ్లి కొడుకును నిలదీశాడు. ఈ క్రమంలోనే వరుడు ప్రవీణ్ కుమార్ వంశీకి మధ్య గొడవ జరిగింది.  ఈ విషయమై ప్రవీణ్ కుమార్ పోలీసులకు పిర్యాదు చేశాడు. తాను పెళ్లి చేసుకొన్న యువతిని వంశీ అనే యువకుడు ప్రేమించానని  గొడవ చేశాడని ప్రవీణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దీంతో పోలీసులు వంశీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అయితే వంశీని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఈ సమయంలోనే  దివ్య తన మనసులోని మాటను బయటపెట్టింది. తాను ప్రియుడి వంశీతోనే ఉంటానని తెగేసి చెప్పింది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోలీసులు, ఇరు కుటుంబసభ్యులు రాజీ చేసేందుకు ప్రయత్నించినా కూడ ఆమె వినలేదు. దీంతో నూతన వరుడు ప్రవీణ్ కుమార్ కుటుంబసభ్యులతో కలిసి స్వగ్రామానికి వెళ్లిపోయాడు. దివ్య కుటుంబసభ్యులు కూడ పోలీస్ స్టేషన్ లోనే ఆమెను వదిలి వెళ్లారు. పోలీస్ స్టేషన్ లోనే ఉన్న దివ్యను పోలీసులు స్వధార్ హోం కు తరలించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios