Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ లిక్కర్ స్కామ్ రిమాండ్ రిపోర్ట్‌లో పేరు.. కాసేపట్లో మీడియా ముందుకు ఎమ్మెల్సీ కవిత..

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించి నిందితుల్లో ఒకరైన అమిత్ అరోరా అరెస్ట్ తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమర్పించిన రిమాండ్ రిపోర్టులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత‌తో సహా పలువురి పేర్లను ప్రస్తావించిన సంగతి  తెలిసిందే. 

Kalvakuntla kavitha Will conduct press meet after her name in ED remand report of Amit Arora
Author
First Published Dec 1, 2022, 9:38 AM IST

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించి నిందితుల్లో ఒకరైన అమిత్ అరోరా అరెస్ట్ తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమర్పించిన రిమాండ్ రిపోర్టులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత‌తో సహా పలువురి పేర్లను ప్రస్తావించిన సంగతి  తెలిసిందే. ఇది తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. టీఆర్ఎస్, కవిత టార్గెట్‌గా బీజేపీ విమర్శల దాడిని మరింతగా పెంచింది. ఈ క్రమంలోనే కవిత స్పందించనున్నారు. కాసేపట్లో కవిత హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లానున్నారు. ఈ మేరకు మీడియాకు సమాచారం అందింది. ఈడీ రిమాండ్ రిపోర్ట్‌లో ఆమె పేరు ప్రస్తావన.. ప్రస్తావించిన అంశాలపై కవిత స్పందించే అవకాశం ఉంది. 

ఇక, డిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు బుధవారం ఉదయం అమిత్ అరోరాను అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ప్రస్తావించారు. రిమాండ్ రిపోర్టులో వైఎస్సార్‌సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన కుమారుడు రాఘవ పేర్లు కూడా ఉన్నాయి.

కేసును దర్యాప్తు కోసం ఏజెన్సీకి అప్పగించిన తర్వాత కవిత తన మొబైల్ ఫోన్ ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ (ఐఎంఈఐ)ని ఆరుసార్లు మార్చుకున్నారని ఈడీ అధికారులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఇంకా, ఐఎంఈఐ ఆధారంగా డేటాను విశ్లేషించినట్టుగా తెలిపింది. దర్యాప్తుకు ఆటంకం కలిగించడానికి డిజిటల్ సాక్ష్యం నాశనం చేయబడిందని కనుగొంది.

ఈడీ అధికారుల ప్రకారం.. శరత్ చంద్రారెడ్డి, కవిత, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అమిత్ అరోరా నియంత్రణలో ఉన్న సౌత్ గ్రూప్ అనే కంపెనీ నుంచి ఆప్ నాయకుల తరపున విజయ్ నాయర్ రూ. 100 కోట్ల ముడుపులు అందుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఇదే విషయాన్ని అమిత్ అరోరా వెల్లడించారు. దర్యాప్తును అడ్డుకునేందుకు ఉద్దేశపూర్వకంగానే విస్తృతమైన డిజిటల్ సాక్ష్యాలను ధ్వంసం చేశారు. కేసును ఏజెన్సీకి అప్పగించిన తర్వాత 36 మంది అనుమానితులు/నిందితులు తమ 176 సెల్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లను ధ్వంసం చేశారు. 170 సెల్‌ఫోన్‌లలో 17 సెల్‌ఫోన్‌ల నుంచి డేటాను తిరిగి పొందగలిగాం. అన్ని ఫోన్లు దొరికి ఉంటే ఈ కేసులో చేతులు మారిని మరిన్ని ముడుపులు వెలుగులోకి వచ్చేవి. ఇతర ముఖ్యమైన వ్యక్తుల ప్రమేయం మరింత స్పష్టంగా బయటపడి ఉండేది. 

Follow Us:
Download App:
  • android
  • ios