Asianet News TeluguAsianet News Telugu

పోచారంను పరామర్శించిన కడియం (వీడియో)

మాతృ వియోగం పొందిన తెలంగాణ శాసనసభ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డిని శనివారంనాడు మాజీ ఉప ముఖ్యమంత్రి శ్రీ కడియం శ్రీహరి పరామర్శించారు. స్పీకర్ స్వగ్రామం పోచారంలోని ఇంటివద్ద ఆయనను పరామర్శించారు. స్పీకర్ మాతృమూర్తి పాపవ్వకు నివాళులు అర్పించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. స్పీకర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కడియం శ్రీహరితో పాటు తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ రాకేష్, రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డి కూడా ఉన్నారు.

మాతృ వియోగం పొందిన తెలంగాణ శాసనసభ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డిని శనివారంనాడు మాజీ ఉప ముఖ్యమంత్రి శ్రీ కడియం శ్రీహరి పరామర్శించారు. స్పీకర్ స్వగ్రామం పోచారంలోని ఇంటివద్ద ఆయనను పరామర్శించారు. స్పీకర్ మాతృమూర్తి పాపవ్వకు నివాళులు అర్పించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. స్పీకర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కడియం శ్రీహరితో పాటు తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ రాకేష్, రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డి కూడా ఉన్నారు.

Video Top Stories