Asianet News TeluguAsianet News Telugu

బాబ్లీ కేసు: ఆ ఇద్దరికి నాన్ బెయిలబుల్ వారెంట్ రద్దు

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన బాబ్లీ కేసును నవంబర్ 1కి వాయిదా వేసింది ధర్మాబాద్ కోర్టు. బాబ్లీ కేసుకు సంబంధించి అక్టోబర్ 15న హాజరుకావాలని సెప్టెంబర్ 21న ధర్మాబాద్ కోర్టు ఆదేశించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సైతం వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. 

Dharmabad court issue
Author
Dharmabad, First Published Oct 15, 2018, 6:09 PM IST

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన బాబ్లీ కేసును నవంబర్ 1కి వాయిదా వేసింది ధర్మాబాద్ కోర్టు. బాబ్లీ కేసుకు సంబంధించి అక్టోబర్ 15న హాజరుకావాలని సెప్టెంబర్ 21న ధర్మాబాద్ కోర్టు ఆదేశించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సైతం వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. అయితే తనకు వ్యక్తిగత హాజరునుంచి మినహాయింపు కావాలని చంద్రబాబు రీకాల్ పిటీషన్ దాఖలు చేశారు. దీంతో చంద్రబాబుకు ధర్మాబాద్ కోర్టు మినహాయింపు ఇచ్చింది. 

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తరపును లాయర్ సుబ్బారావు వాదనలు వినిపించారు. ఇరువాదనలు విన్న కోర్టు నవంబర్ 1కి వాయిదా వేసింది. మరోవైపు విజయరమణరావు, టీఆర్ఎస్ నేత హన్మంత్ షిండేలకు నాన్ బెయిల్ బుల్ వారెంట్ ను ధర్మాబాద్ కోర్టు రద్దు చేసింది. ఇద్దరికి రూ.15వేలు పూచీకత్తు, రూ.5000జరిమానా విధించింది. మరోవైపు కేసులో ఉన్న ప్రతీ ఒక్కరి పూర్తి వివరాలు ఫోటోలతో సహా సమర్పించాలని పోలీసులకు కోర్టు ఆదేశించింది. 

బాబ్లీ ప్రాజెక్టు సందర్భన కోసం 2010 జూలై 16వ తేదీన వెళ్లిన  అప్పటి ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి చెందిన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుతోపాటు పలువురు టీడీపీ ప్రజా ప్రతినిధులను మహరాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయమై కేసు నమోదైంది.

బాబ్లీ ప్రాజెక్టు సందర్భనకు వచ్చిన చంద్రబాబు సహ పలువురు టీడీపీ ప్రజాప్రతినిధులు అధికారుల విధులకు ఆటంకం కల్గించారని కేసు నమోదైంది. ఈ కేసు విషయమై 16 మందికి ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్ ను సెప్టెంబర్ నెలలో జారీ చేసింది.

2018 సెప్టెంబర్ 21వ తేదీన ధర్మాబాద్ కోర్టుకు హజరుకావాలని ఆదేశించింది.  అయితే  ధర్మాబాద్ కోర్టుకు హజరైన మాజీ ఎమ్మెల్యేలు  కేఎస్ రత్నం గంగుల కమలాకర్,  ప్రకాష్‌గౌడ్ లకు  కోర్టు సెప్టెంబర్ 21న బెయిల్ మంజూరు చేసింది.అదే రోజున కోర్టుకు హాజరుకాకుండా బాబు రీకాల్ పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా అక్టోబర్ 11వ తేదీన రెండోసారి కూడ రీకాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రీకాల్ పిటిషన్ పైనే అక్టోబర్ 15వ తేదీన కోర్టుకు హజరుకాకుండా బాబుకు ధర్మాబాద్ కోర్టు మినహయింపు ఇచ్చింది. 

ఈ వార్తలు కూడా చదవండి

ధర్మాబాద్ కోర్టుకు గైర్హాజరు: చంద్రబాబు నిర్ణయం

బాబ్లీ కేసు: కోర్టుకి ర్యాలీగా వెళ్దామన్న మంత్రి, ఆలోచిద్దామన్నచంద్రబాబు

బాబ్లీ కేసులో చంద్రబాబుకు ధర్మాబాద్ కోర్టు షాక్

బాబ్లీకేసు: ధర్మాబాద్‌ కోర్టులో బాబు రీకాల్ పిటిషన్

బాబ్లీ కేసు: ధర్మాబాద్‌ కోర్టులో రీకాల్ పిటిషన్ దాఖలు చేయనున్న రవీంద్రకుమార్

బాబ్లీ కేసుపై రేపే విచారణ : తెలంగాణ నేతలిద్దరు స్వయంగా హాజరయ్యే అవకాశం

బాబ్లీకేసు: రీకాల్ పిటిషన్ దాఖలు చేయాలని బాబు నిర్ణయం

నాన్ బెయిలబుల్ వారంట్‌పై బాబు మల్లగుల్లాలు: ఏం చేద్దాం?

నాకెందుకు నోటీసులు ఇవ్వలేదంటున్నకేంద్ర మాజీ మంత్రి

ధర్మాబాద్ కోర్టు నోటీసులపై స్పందించిన బాబు

అవసరమైతే బాబును అరెస్ట్ చేస్తాం: నాందేడ్ ఎస్పీ సంచలనం

బాబుకు నాన్‌బెయిలబుల్ వారంట్‌తో మాకేం సంబంధం: పురంధేశ్వరీ

బాబుకు నాన్‌బెయిలబుల్ వారంట్: సీఎస్‌తో టీటీడీపీ నేతల భేటీ
'ఐక్యరాజ్యసమితి ప్రసంగాన్ని అడ్డుకోవడానికే బాబుకు నోటీసులు'

బాబుకు నాన్‌ బెయిలబుల్ వారంట్: టీ.టీడీపీ నేతల అత్యవసర సమావేశం

నాన్ బెయిలబుల్ వారంట్ అందుకున్న 16 మంది నేతలు వీరే...

బాబ్లీ ప్రాజెక్టు కేసు: నాడు బాబును ఎందుకు అరెస్ట్ చేశారంటే?

బాబ్లీ ప్రాజెక్టు కేసు: చంద్రబాబుకు త్వరలో ధర్మాబాద్ కోర్టు నోటీసులు

 

Follow Us:
Download App:
  • android
  • ios