Asianet News TeluguAsianet News Telugu

బాబ్లీ కేసులో చంద్రబాబుకు ధర్మాబాద్ కోర్టు షాక్

బాబ్లీ ప్రాజెక్టు కేసులో అక్టోబర్ 15వ తేదీన కోర్టుకు హాజరుకావాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడును ధర్మాబాద్ కోర్టు ఆదేశించింది. ఎవరికీ కూడ ప్రత్యేక  ట్రీట్‌మెంట్లు లేవని కోర్టు తేల్చి చెప్పింది.

Dharmabad court orders to chandrababu should attend court on oct 15
Author
Amaravathi, First Published Sep 21, 2018, 12:43 PM IST

ధర్మాబాద్: బాబ్లీ ప్రాజెక్టు కేసులో అక్టోబర్ 15వ తేదీన కోర్టుకు హాజరుకావాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడును ధర్మాబాద్ కోర్టు ఆదేశించింది. ఎవరికీ కూడ ప్రత్యేక  ట్రీట్‌మెంట్లు లేవని కోర్టు తేల్చి చెప్పింది.

బాబ్లీ ప్రాజెక్టు  కేసు విచారణను అక్టోబర్ 15వ తేదీకి ధర్మాబాద్ కోర్టు  వాయిదా వేసింది. కోర్టుకు హాజరైన  మాజీ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, ప్రకాష్‌గౌడ్, కేఎస్ రత్నం‌లకు బెయిల్ మంజూరు చేసింది.

బాబ్లీ ప్రాజెక్టు  నిర్మాణాన్ని నిరసిస్తూ 2010 జూలై 16వ తేదీన అప్పటి ఏపీ రాష్ట్ర విపక్ష నేత చంద్రబాబునాయుడు, అప్పటి టీడీపీ ప్రజాప్రతినిధులు నిరసన చేపట్టేందుకు వెళ్లారు.ఈ సమయంలో అప్పటి మహారాష్ట్ర సర్కార్ చంద్రబాబునాయుడు సహా పలువురు టీడీపీ నేతలను అరెస్ట్ చేసింది.

ఈ కేసులో ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కల్గించారనే నెపంతో చంద్రబాబునాయుడు సహా మరో 16 మందికి నాన్‌బెయిలబుల్ వారంట్ జారీ చేసింది ధర్మాబాద్ కోర్టు. ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది.

నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేయడంపై  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తరపున  ఎంపీ, న్యాయవాది కనకమేడల రవీంద్రకుమార్ శుక్రవారం నాడు ధర్మాబాద్ కోర్టులో రీకాల్ పిటిషన్ దాఖలు చేశారు. 

ఈ పిటిషన్‌పై వాదనలు విన్న ధర్మాబాద్ కోర్టు  అక్టోబర్ 15 వతేదీకి  కేసును వాయిదా వేసింది.  ఈ కేసులో ఎవరికీ ప్రత్యేక ట్రీట్‌మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది. అక్టోబర్ 15వ తేదీన చంద్రబాబునాయుడు సహా కేసులో ఉన్నవారంతా హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. ఇదిలా ఉంటే కోర్టుకు హాజరైన  మాజీ ఎమ్మెల్యేలు కేఎస్ రత్నం, ప్రకాష్ గౌడ్, గంగుల కమలాకర్‌లకు  కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

సంబంధిత వార్తలు

బాబ్లీకేసు: ధర్మాబాద్‌ కోర్టులో బాబు రీకాల్ పిటిషన్

బాబ్లీ కేసు: ధర్మాబాద్‌ కోర్టులో రీకాల్ పిటిషన్ దాఖలు చేయనున్న రవీంద్రకుమార్

బాబ్లీ కేసుపై రేపే విచారణ : తెలంగాణ నేతలిద్దరు స్వయంగా హాజరయ్యే అవకాశం

బాబ్లీకేసు: రీకాల్ పిటిషన్ దాఖలు చేయాలని బాబు నిర్ణయం

నాన్ బెయిలబుల్ వారంట్‌పై బాబు మల్లగుల్లాలు: ఏం చేద్దాం?

నాకెందుకు నోటీసులు ఇవ్వలేదంటున్నకేంద్ర మాజీ మంత్రి

ధర్మాబాద్ కోర్టు నోటీసులపై స్పందించిన బాబు

అవసరమైతే బాబును అరెస్ట్ చేస్తాం: నాందేడ్ ఎస్పీ సంచలనం

బాబుకు నాన్‌బెయిలబుల్ వారంట్‌తో మాకేం సంబంధం: పురంధేశ్వరీ

బాబుకు నాన్‌బెయిలబుల్ వారంట్: సీఎస్‌తో టీటీడీపీ నేతల భేటీ
'ఐక్యరాజ్యసమితి ప్రసంగాన్ని అడ్డుకోవడానికే బాబుకు నోటీసులు'

బాబుకు నాన్‌ బెయిలబుల్ వారంట్: టీ.టీడీపీ నేతల అత్యవసర సమావేశం

నాన్ బెయిలబుల్ వారంట్ అందుకున్న 16 మంది నేతలు వీరే...

బాబ్లీ ప్రాజెక్టు కేసు: నాడు బాబును ఎందుకు అరెస్ట్ చేశారంటే?

బాబ్లీ ప్రాజెక్టు కేసు: చంద్రబాబుకు త్వరలో ధర్మాబాద్ కోర్టు నోటీసులు

Follow Us:
Download App:
  • android
  • ios