Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ వర్షాలంటే..?
Weather Update: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారింది. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఈ క్రమంలోనే సముంద్రంలోకి వెళ్లవద్దని మత్స్యకారులను హెచ్చరించింది.

పిడుగులు, ఉరుములతో దంచేయనున్న వానలు.. ఏపీ, తెలంగాణలో ఆ జిల్లాలకు వార్నింగ్
తెలుగు రాష్ట్రాల్లో క్లైమేట్ ఒక్కసారిగా ఛేంజ్ అయిపోయింది. ఒకపక్క ఎండలు కొడుతుంటే, ఇంకోపక్క ఊహించని విధంగా వానలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వరుణుడు అసలు ముఖమే చూపించకపోయేసరికి రైతన్నలు, జనాలు వర్షాల కోసం కళ్లు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు భారత వాతావరణ శాఖ (IMD) క్రేజీ అప్డేట్ ఇచ్చింది. ఆదివారం ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పింది.
అల్పపీడన ఎఫెక్ట్.. సముద్రంలో డేంజర్ బెల్స్
వాయువ్య బంగాళాఖాతం పరిధిలోని పశ్చిమ బెంగాల్ - ఉత్తర ఒడిశా తీరాల దగ్గర ఓ అల్పపీడనం ఫామ్ అయింది. ఇది నెక్స్ట్ రెండు రోజుల్లో మరింత స్ట్రాంగ్ అయ్యే ఛాన్స్ ఉందని ఏపీ విపత్సల నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. ప్రస్తుతానికి ఏపీపై దీని ఎఫెక్ట్ తక్కువగానే ఉన్నప్పటికీ, ఉత్తర కోస్తాంధ్ర తీరం వెంట గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల స్పీడ్తో గాలలు వీస్తాయని చెప్పింది. అందుకే జూలై 26 నుంచి 28 వరకు మత్స్యకారులు ఎవ్వరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్లో వర్షాలు
నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్తో కోస్తాంధ్ర, రాయలసీమలో చెదురుమదురు వర్షాలు పడతాయని ఐఎండీ అంచనా వేసింది. ఏపీలోని శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులు, ఉరుములతో కూడిన లైట్ టు మోడరేట్ రైన్స్ పడొచ్చని తెలిపారు. రాయలసీమలో కూడా 40 నుంచి 50 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
తెలంగాణలోని ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్
ఇక తెలంగాణ విషయానికి వస్తే, ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడొచ్చు. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో నెలాఖరు వరకు అడపాదడపా చినుకులు పడతాయని అంచనా వేస్తున్నారు. అంతేకాదు, రాష్ట్రవ్యాప్తంగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల స్పీడ్తో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉంది.
బయటకు వెళ్లేముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ఉష్ణోగ్రతలు నార్మల్ కంటే కాస్త ఎక్కువగా నమోదు అవుతున్నప్పటికీ తీవ్రమైన ఎండలైతే ఉండవు. కానీ, అకస్మాత్తుగా పడే వర్షాలు, మెరుపులు, పిడుగుల వల్ల ఇబ్బందులు రావచ్చు. పొలాల్లో పనిచేసే రైతులు, బైక్లపై వెళ్లే ప్రయాణికులు చాలా జాగ్రత్తగా ఉండాలి.
• వర్షం పడే సమయంలో చెట్ల కింద గానీ, కరెంట్ స్తంభాలు, బిల్బోర్డులు/హోర్డింగ్ల దగ్గర నిలబడకూడదు.
• వర్ష సూచన ఉన్నప్పుడు వెంటనే సురక్షితమైన బిల్డింగ్లలోకి వెళ్లడం మంచిది.
• వాతావరణ అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ సేఫ్గా ఉండండి.

