Asianet News TeluguAsianet News Telugu

బాబుకు నాన్‌బెయిలబుల్ వారంట్: సీఎస్‌తో టీటీడీపీ నేతల భేటీ

బాబ్లీ ప్రాజెక్టు కేసు విషయమై ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసిన నేపథ్యంలో తెలంగాణ టీడీపీ నేతలు శుక్రవారం  నాడు మధ్యాహ్నం  తెలంగాణ సీఎస్ ఎస్ కే జోషిని కలిశారు.

TTDP leaders meets CS SK joshi at secretariat
Author
Hyderabad, First Published Sep 14, 2018, 2:47 PM IST


హైదరాబాద్: బాబ్లీ ప్రాజెక్టు కేసు విషయమై ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసిన నేపథ్యంలో తెలంగాణ టీడీపీ నేతలు శుక్రవారం  నాడు మధ్యాహ్నం  తెలంగాణ సీఎస్ ఎస్ కే జోషిని కలిశారు.

బాబ్లీ ప్రాజెక్టును ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో పాటు మరో 16 మందికి ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ నోటీసులు జారీ చేసింది.ఈ నోటీసుల విషయమై  చర్చించేందుకు  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో  తెలంగాణ టీడీపీ నేతలు శుక్రవారం నాడు సమావేశమయ్యారు.

బాబ్లీ ప్రాజెక్టు వివాదంపై  ధర్మాబాద్ కోర్టు ఇచ్చిన నోటీసు విషయమై సీఎస్‌తో టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios