మసాజ్ పార్లర్ మాటున వ్యభిచారం.. హైదరాబాద్లో మరో ముఠా గుట్టురట్టు..
హైదరాబాద్లో మరో వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. బంజారాహిల్స్లోని ఓ మసాజ్ పార్లర్పై దాడి చేసిన టాస్క్ పోర్స్ పోలీసులు.. అక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నట్టుగా గుర్తించారు.
హైదరాబాద్లో మరో వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. బంజారాహిల్స్లోని ఓ మసాజ్ పార్లర్పై దాడి చేసిన టాస్క్ పోర్స్ పోలీసులు.. అక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నట్టుగా గుర్తించారు. ఇందుకు సంబంధించి మసాజ్ పార్లర్ నిర్వాహకులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. అలాగే 14 మంది విటులను అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచార కూపం నుంచి నలుగురు మహిళలను కూడా రక్షించారు. వివరాలు.. బంజారాహిల్స్లో రోడ్ నెంబర్ 1 లోని ఉన్న ఆయుష్ బ్యూటీ స్పాలో మసాజ్ మాటున వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు చేశారు.
ఈ క్రమంలోనే రిసెప్షనిస్ట్ అయిన బేగం రుహితో పాటు స్పాలో ఉన్న పి అభిషేక్తో పాటు మరొకరిని అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి కండోమ్లో పీవోఎస్ మిషన్, రూ. 32,830 నగదను స్వాధీనం చేసుకున్నారు. బాడీ మసాజ్ను సాకుగా చూపి మసాజ్ పార్లర్లో వ్యభిచారం నిర్వహిస్తున్న యాజమాన్యం కస్టమర్ల నుంచి భారీ మొత్తంలో వసూలు చేస్తోందని పోలీసులుతెలిపారు. ఈ ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గతవారం టాస్క్ఫోర్స్ పోలీసుల బృందం బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లోని మరో స్పా మరియు మసాజ్ పార్లర్పై దాడి చేసి వ్యభిచారంలోకి నెట్టబడిన 10 మంది మహిళలను రక్షించిన సంగతి తెలిసిందే. వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ మహిళతో పాటు ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. అలాగే 18 మంది కస్టమర్లను కూడా పోలీసులు పట్టుకున్నారు.