నేడు విద్యాశాఖతో సిఎం రేవంత్ భేటీ.. ఫీజుల నియంత్రణపై కీలక నిర్ణయం !
CM Revanth Reddy: విద్యారంగంపై నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశంతో సీఎం ఎ.రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.
![CM Revanth Reddy to Convene High-Level Education Review Meeting KRJ CM Revanth Reddy to Convene High-Level Education Review Meeting KRJ](https://static-ai.asianetnews.com/images/01hhgtxg0rddjdn4ye10ew670m/thenaveena-1734604719056916710-01-jpg_363x203xt.jpg)
CM Revanth Reddy: విద్యారంగంపై నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, ఆ శాఖ ఉన్నతాధికారులతో సీఎం ఎ.రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. విద్యా సంస్థల పునఃప్రారంభానికి కొన్ని వారాల ముందు, విద్యా రంగాన్ని క్రమబద్ధీకరించే లక్ష్యంతో ఈ సమావేశం జరగనుంది.
ప్రైవేట్ సంస్థలలో రాబోయే ఫీజుల పెంపు, రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న వైస్ ఛాన్సలర్ల నియామకాలు, ప్రభుత్వ వాగ్దానాల వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు. అంతర్జాతీయ పాఠశాలల స్థాపన, పనితీరు గురించి చర్చించనున్నారు. అలాగే.. విద్యా సంవత్సరానికి ముందే విద్యార్థుల వసతుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్ష నిర్వహిస్తారు.
కొత్త అకడమిక్ క్యాలెండర్ ఇప్పటికే సెట్ చేయబడింది. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. జూన్ 1 నుండి కళాశాలలు తమ సెషన్లను ప్రారంభించనున్నాయి. ఫీజుల పెంపు సమస్య తల్లిదండ్రులు, విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తుంది. స్థోమత,నాణ్యమైన విద్య అందుబాటులో ఉండేలా ఈ ఫీజు పెంపుదలని నిర్వహించడానికి , నియంత్రించడానికి విధానాలను రూపొందించడంపై సమావేశం దృష్టి సారించే అవకాశం ఉంది. మరోవైపు.. వైస్-ఛాన్సలర్ నియామకాలు వివాదాస్పద అంశంగా మారింది.దీంతో వీలైనంత త్వరగా ఈ నియామకాలను పూర్తి చేయనున్నట్టు సమాచారం.