Asianet News TeluguAsianet News Telugu

Air pollution: దేశంలోని 76.8 శాతం మందిపై గాలి కాలుష్యం ఎఫెక్ట్.. హైద‌రాబాద్ లో పెరుగుతున్న శ్వాస సంబంధ కేసులు

Hyderabad: హైద‌రాబాద్ న‌గ‌రంలో గాలి కాలుష్యం క్ర‌మంగా పెరుగుతున్న‌ద‌నీ, దీని కార‌ణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య‌తో పాటు సంబంధిత కేసులు అధికంగా ఉంటున్నాయ‌ని వైద్య నివేదిక‌లు పేర్కొంటున్నాయి. ఇటీవలి కాలంలో వాయు కాలుష్య స్థాయిలు పెరగడంతోపాటు రద్దీగా ఉండే ప్రదేశాల్లో నివసించే ప్రజలు న్యుమోనియాకు దారితీయడం వల్ల సీజనల్‌గా వచ్చే ఆస్తమా, బ్రోన్కైటిస్‌లు కూడా పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.
 

Air pollution affects 76.8 percent of the country; Respiratory cases on the rise in Hyderabad RMA
Author
First Published Sep 17, 2023, 11:33 AM IST

Rising air pollution in Hyderabad: హైద‌రాబాద్ న‌గ‌రంలో గాలి కాలుష్యం క్ర‌మంగా పెరుగుతున్న‌ద‌నీ, దీని కార‌ణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య‌తో పాటు సంబంధిత కేసులు అధికంగా ఉంటున్నాయ‌ని వైద్య నివేదిక‌లు పేర్కొంటున్నాయి. ఇటీవలి కాలంలో వాయు కాలుష్య స్థాయిలు పెరగడంతోపాటు రద్దీగా ఉండే ప్రదేశాల్లో నివసించే ప్రజలు న్యుమోనియాకు దారితీయడం వల్ల సీజనల్‌గా వచ్చే ఆస్తమా, బ్రోన్కైటిస్‌లు కూడా పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.

దేశంలో శ్వాసకోశ వ్యాధులకు వాయు కాలుష్యం ఒక ముఖ్యమైన కారణమని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ సత్యపాల్ సింగ్ బఘేల్ ఇటీవల లోక్ స‌భ‌లో పునరుద్ఘాటించారు. దేశ జనాభాలో 76.8 శాతం మంది వార్షిక జనాభా-వెయిటెడ్ సగటు పీఎం (పార్టిక్యులేట్ మ్యాటర్) 2.5 కు గురయ్యారనీ, ఇది నేషనల్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ ప్రకారం క్యూబిక్ మీటర్ కు 40 మైక్రోగ్రాముల కంటే ఎక్కువ అని మంత్రి చెప్పారు. కాలుష్య‌కార‌కాలు పీఎం 2.5 ప్రాణాంతక రకం, ఎందుకంటే ఇది దాని చిన్న పరిమాణం క‌లిగివుండ‌టంతో కారణంగా శరీర కణజాలాలలోకి లోతుగా చొచ్చుకుపోతుంది.

హైద‌రాబాద్ లో ఆందోళ‌నక‌రంగా..

పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (పీహెచ్ఎఫ్ఐ), ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మ్యాట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ (హెచ్ఎంఈ) సహకారంతో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) చేసిన అధ్యయనాన్ని ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి బఘేల్ ఉటంకించారు. ఇక హైద‌రాబాద్ నగరంలో ఆగస్టు మొదటి వారంలో తాజా పీసీబీ డేటా ప్రకారం, 31 స్టేషన్లలో 15 స్టేషన్లలో 60 మైక్రోగ్రాముల కంటే ఎక్కువగా పీఎం10 స్థాయిలు న‌మోద‌య్యాయి. కోకాపేట పీఎం స్టేషన్ లో పీఎం 2.5 స్థాయిలు 40 కంటే ఎక్కువ నమోదయ్యాయి. ఇండోర్, అవుట్ డోర్ వాయు కాలుష్యం సమానంగా హానికరమని ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ కన్సల్టెంట్ డాక్టర్ విశ్వేశ్వరన్ బాలసుబ్రమణ్యం తెలిపిన‌ట్టు ద‌క్కన్ క్రానికల్ నివేదించింది. జీవద్రవ్యాన్ని కాల్చడం వల్ల వెలువడే గృహ వాయు కాలుష్యం శ్వాసకోశ వ్యాధులకు ప్రధాన కారణమనీ, దీనిపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

గాలి కాలుష్యంపై వైద్యుల ఆందోళ‌న 

వాయుకాలుష్యంలోని అన్ని భాగాల్లోని ధూళికణాలు వాయుమార్గాలు, ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి ఆస్తమా, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, క్యాన్సర్ వంటి సీఓపీడీ, ఊపిరితిత్తుల అసాధారణతలకు కారణమవుతాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాయు కాలుష్యానికి గురైనప్పుడు గర్భిణులు నెలలు నిండకుండానే ప్రసవించారని అధ్యయనాల్లో తేలిందని డాక్టర్ బాలసుబ్రమణ్యం తెలిపారు. వాయుకాలుష్యం పెరగడం, రద్దీగా ఉండే ప్రదేశాల్లో నివసించే ప్రజలు న్యుమోనియాకు దారితీయడం వల్ల ఇటీవలి కాలంలో సీజనల్ అలర్జీ ఆస్తమా, బ్రోన్కైటిస్ కూడా పెరుగుతున్నాయని వైద్యులు తెలిపారు.

సీవోపీడీ కేసులు 20 శాతం పెరిగాయనీ, ధూమపానం చేయని వారిపై కూడా ప్రభావం చూపాయని చెస్ట్ ఆసుపత్రి పల్మనాలజిస్ట్ డాక్టర్ టి ప్రమోద్ కుమార్ చెప్పారు. ధూమపానంతో సంబంధంలేని ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడే వారి సంఖ్య పెరుగుతోంది. కాలుష్యానికి గురికావడం, జన్యు సిద్ధత దీనికి ప్రధాన కారణమని చెప్పారు. కఠినమైన నిబంధనలు, క్రమం తప్పకుండా కాలుష్య తనిఖీలు చేయడం, వాహన ఉద్గారాల స్థాయిలు పరిమితిని దాటకుండా చూసుకోవడం గాలి కాలుష్య నియంత్ర‌ణ‌కు సహాయపడుతుందని చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios