Asianet News TeluguAsianet News Telugu

గాలిపటం ఎగరవేస్తూ.. మృత్యుఒడిలోకి..

గాలిపటం ఎగరవేస్తూ ఓ బాలుడు మూడో అంతస్తు నుంచి కిందపడి మృతిచెందిన సంఘటన హబీబ్‌నగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో  చోటు చేసుకుంది

11years old boy died to fall down on building in hyderabad
Author
Hyderabad, First Published Jan 15, 2019, 9:56 AM IST


గాలిపటం ఎగరవేస్తూ ఓ బాలుడు మూడో అంతస్తు నుంచి కిందపడి మృతిచెందిన సంఘటన హబీబ్‌నగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో  చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...జవహర్‌నగర ప్రాంతానికి చెందిన సయ్యద్‌ ఒబేద్‌ ఖాద్రి ఆయన కుమారుడు సయ్యద్‌ జునేద్‌ ఖాద్రీ (11) పక్కనున్న మూడో అంతస్తుపైకి ఎక్కి గాలిపటం ఎగరవేస్తున్నారు.ఆ సమయంలో ప్రమాదవశాత్తూ కాలు జారి బాలుడు కిందపడ్డాడు. తీవ్ర గాయాలైన బాలుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందాడు.

మరో ఘటనలో... 
నాంపల్లి యూసుఫ్‌బాబా దర్గా సమీపంలోని షాకామూసి దర్గా ప్రాంతంలో గాలి పటం ఎగరవేస్తున్న మహ్మద్‌ అబ్దుల్‌ రహమాన్‌ (9) ప్రమాదవశాత్తూ మొదటి అంతస్తు నుంచి కిందపడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బాలుడు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. ఎస్సైలు శివకుమార్‌, విజయానంద్‌ కేసులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios