భారత్ - పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు దాటుతున్న పాకిస్థాన్ జాతీయుడిని బీఎస్ఎఫ్ జవాన్లు కాల్పి చంపారు. ఆయుధం పట్టుకొని బార్డర్ దాటుతున్న అతడిని బీఎస్ఎఫ్ జవాన్లు ఆగిపోవాలని హెచ్చరించినా వినకపోవడంతో కాల్పులు జరపాల్సి వచ్చింది.
NATIONAL Jan 3, 2023, 2:25 PM IST
పంజాబ్లోని గురుదాస్పూర్ సెక్టార్లోని అంతర్జాతీయ సరిహద్దు (ఐబి) సమీపంలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్ఎఫ్) సోమవారం మరో పాకిస్థానీ డ్రోన్తో సుమారు 1 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకుంది.
NATIONAL Jan 3, 2023, 5:03 AM IST
బంగ్లాదేశ్ సరిహద్దులో ఓ బీఎస్ఎఫ్ శునకం ప్రసవించింది. మూడు కుక్క పిల్లలకు జన్మనిచ్చింది. దీనిపై బీఎస్ఎఫ్ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది. రూల్స్ ప్రకారం, హై సెక్యూరిటీ జోన్లో బీఎస్ఎఫ్ శునకం గర్భం దాల్చరాదు.
NATIONAL Dec 31, 2022, 1:58 PM IST
గుజరాత్లో ఓ సైనికుడిపై మూక దాడి జరిగింది. ఈ మూక దాడిలో జవాన్ మరణించాడు. తన కూతురి అసభ్య వీడియోను ఆన్లైన్లో పోస్టు చేసిన బాలుడి ఇంటి వద్దకు వెళ్లి నిలదీయగా.. గొడవ జరిగినట్టు ఆర్మీ వర్గాలు తెలిపాయి.
NATIONAL Dec 26, 2022, 8:01 PM IST
భారత్-పాక్ సరిహద్దుల్లోని బోర్డర్ ఔట్ పోస్ట్ డాక్ వద్ద పాకిస్తాన్ డ్రోన్ ను భారత భద్రత బలగాలు కూల్చివేశాయి. మంగళవారం రాత్రి సరిహద్దులో బీఎస్ఎఫ్ జవాన్లు గస్తీ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో డ్రోన్ శబ్ధం రావడంతో అప్రమత్తమైన బలగాలు కాల్పులు జరిపారు. దీంతో పాక్ సరిహద్దుల్లో డ్రోన్ కుప్ప కూలిపోయింది. మరుసటి రోజు నిర్వహించిన గాలింపు చర్యల్లో 4.3 కిలోల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు.
NATIONAL Dec 22, 2022, 3:21 AM IST
పంజాబ్ లోని గురుదాస్పూర్ సెక్టార్లో రాత్రి రెండుసార్లు డ్రోన్ కదలికలు కనిపించాయి. ఆదివారం రాత్రి గురుదాస్పూర్లోని చందు వాడాల అవుట్పోస్టు వద్ద డ్రోన్ శబ్దం వినిపించింది. దీంతో అప్రమత్తమైన జవాన్లు 26 రౌండ్లు కాల్పులు జరిపారు.
NATIONAL Dec 19, 2022, 6:20 PM IST
New Delhi: భారత్-పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న అటారీ-వాఘా ఫ్రంట్లో జాతీయ జెండాను అవనతం చేయడం, రీట్రీట్ వేడుకను చూసేందుకు ప్లాన్ చేసుకుంటున్న వారు తమ సీట్లను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. జనవరి 1 నుంచి ఆన్లైన్లో అటారీ-వాఘా రిట్రీట్ వేడుక బుకింగ్స్ చేసుకోవచ్చునని బీఎస్ఎఫ్ వెల్లడించింది.
NATIONAL Dec 7, 2022, 2:14 AM IST
ఇండో - పాక్ సరిహద్దుల్లో ఓ డ్రోన్ ను భద్రతా బలగాలు కూల్చేశాయి. అందులో నుంచి 5 కిలోల హెరాయిన్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నాయి.
NATIONAL Dec 2, 2022, 4:44 PM IST
New Delhi: పాకిస్థాన్ నుంచి ప్రాణాంతక ఆయుధాలు, మందుగుండు సామగ్రి, మాదకద్రవ్యాలను తీసుకెళ్లే డ్రోన్లను కూల్చివేసేందుకు మేక్ ఇన్ ఇండియా టెక్నాలజీ దోహదపడుతోందని ఇండియాన్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) పేర్కొంది. సరిహద్దులో 2021లో కూల్చినవేసిన కేవలం ఒక్క డ్రోన్ తో పోలిస్తే ఈ ఏడాది ఇప్పటి వరకు 16 డ్రోన్లను కూల్చివేసినట్టు బీఎస్ఎఫ్ చీఫ్ తెలిపారు.
NATIONAL Dec 1, 2022, 5:59 AM IST
పంజాబ్ లోని అమృత్సర్ రూరల్ జిల్లా చహర్పూర్ గ్రామ సమీపంలో సోమవారం అర్థరాత్రి గస్తీ కాస్తున్న బీఎస్ఎఫ్ మహిళా జవాన్లు డ్రోన్ల కదలికను చూశారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు పలు రౌండ్లు కాల్పులు జరిపి డ్రోన్ను కూల్చివేశారు.
NATIONAL Nov 29, 2022, 11:16 AM IST
పాకిస్థాన్ ఉగ్రచర్యలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. తాజాగా ఫిరోజ్పూర్లో పాకిస్థానీ బెలూన్ను బీఎస్ఎఫ్ అధికారులు గుర్తించారు. ఫిరోజ్పూర్లోని గురుహషాయ్లోని బహదూర్ సరిహద్దు అవుట్పోస్ట్ సమీపంలో బీఎస్ఎఫ్ కు చెందిన 160వ బెటాలియన్కు చెందిన సైనికులు పాకిస్తాన్ బెలూన్ను స్వాధీనం చేసుకున్నారు.
NATIONAL Nov 26, 2022, 6:20 PM IST
పంజాబ్లోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో శనివారం అర్థరాత్రి డ్రోన్ల చొరబాటు కలకలం చేలారేగింది. గత రెండు రోజుల నుంచి రాత్రింబవళ్లు నిరంతరంగా పంపుతున్న పాక్ డ్రోన్లు భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే అప్రమత్తమైన బీఎస్ఎఫ్ సిబ్బంది వారిని అడ్డుకుంటున్నారు.
NATIONAL Nov 20, 2022, 4:04 PM IST
సరిహద్దు ఆవల నుంచి డ్రోన్ల ద్వారా మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రిని పంపుతున్నట్లు బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ పంకజ్ కుమార్ సింగ్ తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించడానికి బిఎస్ఎఫ్ పటిష్టమైన చర్యల కోసం చూస్తోందని ఆయన అన్నారు.
NATIONAL Nov 13, 2022, 11:11 AM IST
పంజాబ్లోని ఫిరోజ్పూర్ జిల్లాలో పాకిస్థాన్ నుంచి భారత భూభాగంలోకి ప్రవేశించిన డ్రోన్ను సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) కూల్చివేసింది. మంగళవారం రాత్రి 11.25 గంటల ప్రాంతంలో ఫిరోజ్పూర్లోని గండు కిల్చా గ్రామం సమీపంలో పాకిస్తాన్ నుండి భారత భూభాగంలోకి అనుమానాస్పదంగా డ్రోన్ చొచ్చుక వచ్చినట్టు గుర్తించారు.
NATIONAL Nov 9, 2022, 5:18 PM IST
పంజాబ్ రాష్ట్రంలోని ఇండియా పాకిస్తాన్ సరిహద్దుల్లో డ్రోన్ ను బీఎస్ఎఫ్ అధికారులు సోమవారంనాడు అర్ధరాత్రి కూల్చివేశారు. డ్రోన్ ద్వారా డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నారని బీఎస్ఎఫ్ అధికారులు గుర్తించారు.
NATIONAL Oct 18, 2022, 10:02 AM IST