పాకిస్తాన్ డ్రోన్ కూల్చివేసిన బీఎస్ఎఫ్ జవాన్లు.. 4.3 కిలోల హెరాయిన్ స్వాధీనం
భారత్-పాక్ సరిహద్దుల్లోని బోర్డర్ ఔట్ పోస్ట్ డాక్ వద్ద పాకిస్తాన్ డ్రోన్ ను భారత భద్రత బలగాలు కూల్చివేశాయి. మంగళవారం రాత్రి సరిహద్దులో బీఎస్ఎఫ్ జవాన్లు గస్తీ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో డ్రోన్ శబ్ధం రావడంతో అప్రమత్తమైన బలగాలు కాల్పులు జరిపారు. దీంతో పాక్ సరిహద్దుల్లో డ్రోన్ కుప్ప కూలిపోయింది. మరుసటి రోజు నిర్వహించిన గాలింపు చర్యల్లో 4.3 కిలోల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు.
ఇండో-పాక్ సరిహద్దులోని బోర్డర్ ఔట్ పోస్ట్ (బీఓపీ) డాక్ వద్ద పాకిస్థాన్ ప్రయత్నాన్ని అప్రమత్తమైన బీఎస్ఎఫ్ సిబ్బంది మరోసారి భగ్నం చేశారు. మంగళవారం రాత్రి 7:20 గంటలకు సరిహద్దులో దట్టమైన పొగమంచుతో బీఎస్ఎఫ్ జవాన్లు గస్తీ నిర్వహిస్తున్నారు. అప్పుడే సైనికులకు డ్రోన్ శబ్దం వినిపించింది.
అప్రమత్తమైన సైనికులు వెంటనే కాల్పులు జరిపారు. కొద్దిసేపటికే సౌండ్ ఆగిపోయింది. దీంతో డ్రోన్ పాకిస్థాన్కు తిరిగి వెళ్లిపోయిందని భద్రతా బలాలు భావించాయి. కానీ, అనంతరం నిర్వహించిన గాలింపు చర్యల్లో పాకిస్థాన్ సరిహద్దుల్లో డ్రోన్ కుప్ప కూలి పడినట్టు గుర్తించారు. దీని తరువాత పాకిస్తాన్ రేంజర్ల సైనికులు డ్రోన్ను తీసుకెళ్లారు.
డ్రోన్ చొరబాటుపై వెంటనే పోలీసులకు, ఇతర ఏజెన్సీలకు సమాచారం అందించామని బీఎస్ఎఫ్ అధికార ప్రతినిధి తెలిపారు. దీని తర్వాత BSF, పోలీసులు డావోకే గ్రామాన్ని చుట్టుముట్టారు. పోలీసులు, ఇతర ఏజెన్సీలతో కలిసి బీఎస్ఎఫ్ బుధవారం ఉదయం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. సోదాల్లో భరోపాల్ గ్రామ సమీపంలోని ఓ పొలంలో పసుపు రంగు టేపుతో చుట్టిన ప్యాకెట్ కనిపించింది. దాంట్లో 4.3 హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. సాయంత్రం వరకు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినా.. హెరాయిన్ తప్ప వేరే వస్తువులు దొరకలేదని అధికారులు వెల్లడించారు.
“డిసెంబర్ 20న సాయంత్రం 7.20 సమయంలో సరిహద్దు వద్ద మోహరించిన BSF సైనికులు అమృత్సర్లోని డావోకే గ్రామం సమీపంలో ఉన్న ప్రాంతంలో పాకిస్తాన్ నుండి భారత భూభాగంలోకి ప్రవేశించిన డ్రోన్ శబ్దం విన్నారు. దీంతో అప్రమత్తమై కాల్పులు జరపడంతో డ్రోన్ చొరబాటును అడ్డుకున్నారు. మరుసటి రోజు (డిసెంబర్ 21న) BSF సిబ్బంది సోదాలు సమయంలో భరోపాల్లో సరిహద్దులోని ఓ పోలంలో 4.3 కిలోల హెరాయిన్గా స్వాధీనం చేసుకున్నారు" అని బీఎస్ఎఫ్ ఓ ప్రకటనలో పేర్కొంది.
నవంబర్ 26న, అమృత్సర్ సెక్టార్లోని డావోకే సరిహద్దు ఔట్పోస్ట్ వద్ద మోహరించిన భద్రతా సిబ్బంది పాకిస్తాన్ వైపు నుండి ప్రవేశించిన డ్రోన్ ను కుప్పకూల్చరు. INSAS రైఫిల్స్ నుండి డ్రోన్పైకి ఆరు రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలిసింది. ఆడ్రోన్ ను చైనా తయారు చేసినట్టు కనుగొన్నారు. ఆ డ్రోన్ లో కొన్ని కెమెరాలు కూడా అమర్చినట్లు గుర్తించారు.