బొత్స అంటే చీపురుపల్లి.. చీపురుపల్లి అంటే బొత్స అన్నంతగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నియోజకవర్గంలో తూర్పు కాపు సామాజికవర్గానిదే ఆధిపత్యం. చీపురుపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. 1983లో పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి 1999 వరకు పసుపు జెండాకు ఎదురులేకుండా పోయింది. టీడీపీ ఆరు సార్లు, కాంగ్రెస్ 4 సార్లు, ఇండిపెండెంట్లు 2 సార్లు, వైసీపీ , ప్రజా సోషలిస్ట్ పార్టీ, స్వతంత్ర పార్టీలు ఒక్కోసారి చొప్పున విజయం సాధించాయి. బొత్సను ఓడించడమే లక్ష్యంగా చంద్రబాబు పావులు కదుపుతున్నారు. బొత్స సత్యనారాయణపై గంటా శ్రీనివాసరావును బరిలో దించాలని ఆయన వ్యూహం రచిస్తున్నారు.
Andhra Pradesh Mar 28, 2024, 7:03 PM IST
శ్రీకాకుళం జిల్లాలో ఆసక్తికర రాజకీయాలు సాగే నియోజకవర్గాల్లో పలాస ఒకటి. ఇక్కడినుండి ప్రస్తుతం మంత్రి సీదిరి అప్పలరాజు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి కూడా మళ్ళీ ఆయననే వైసిపి పోటీలో నిలపగా టిడిపి గౌతు శిరీషను బరిలోకి దింపింది. ఇద్దరు బలమైన నేతల పోటీతో పలాస పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి.
Andhra Pradesh Mar 28, 2024, 6:50 PM IST
చారిత్రకంగా, సాంస్కృతికంగా బొబ్బిలి తెలుగువారికి ఎంతో ప్రత్యేకం. పౌరుషానికి, సాహసానికి, త్యాగానికి బొబ్బిలి యుద్ధం ప్రతీక. తమిళనాడులోని తంజావూరు తర్వాత బొబ్బిలి వీణలకు అంతటి ప్రాధాన్యత వుంది. బొబ్బిలి నియోజకవర్గం తొలి నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఆ పార్టీ ఇక్కడి నుంచి 8 సార్లు, టీడీపీ 3 సార్లు, వైసీపీ రెండు సార్లు, ఇతరులు రెండు సార్లు విజయం సాధించారు. బొబ్బిలి రాజవంశీకులదే ఈ నియోజకవర్గంలో ఆధిపత్యం. తొలి నుంచి నేటి వరకు వారే ఎక్కువగా గెలుస్తూ వస్తున్నారు. బొబ్బిలి కోటపై మరోసారి వైసీపీ జెండా ఎగురవేయాలని సీఎం జగన్ కృతనిశ్చయంతో వున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే చిన అప్పలనాయుడుకు మరోసారి టికెట్ కేటాయించారు. ఈసారి బొబ్బిలి సంస్థాన వారసుడు బేబినాయనకు టీడీపీ టికెట్ కేటాయించింది.
Andhra Pradesh Mar 28, 2024, 5:42 PM IST
శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేట నియోజకవర్గంలో వైసిపి కాస్త బలంగా కనిపిస్తోంది. మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్, ప్రస్తుత మంత్రి ధర్మాన ప్రసాదరావు సోదరులిద్దరూ ఈ నరసన్నపేట నుండి ప్రాతినిధ్యం వహించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా వున్న కృష్ణదాస్ మరోసారి బరిలో నిలిచారు. మరి ఈసారి నరసన్నపేట ఓటర్ల తీర్పు ఎలావుంటుందో చూడాలి.
Andhra Pradesh Mar 28, 2024, 5:14 PM IST
సాలూరు నియోజకవర్గం పరిధిలో సాలూరు, పాచిపెంట, మెంటాడ,మక్కువ మండలాలున్నాయి. గిరిజన ఓటర్లతో వుండే ఈ సెగ్మెంట్.. ఎస్టీ రిజర్వ్డ్. గిరిజన, కాపు, కొప్పుల వెలమ, దళితులతో పాటు నాగవంశం కులాలు అభ్యర్ధుల గెలుపొటములను ప్రభావితం చేస్తున్నాయి. సాలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఆ పార్టీ ఐదు సార్లు, కాంగ్రెస్ మూడు సార్లు, స్వతంత్రులు, వైసీపీ రెండేసి సార్లు, కృషికార్ లోక్ పార్టీ, ప్రజా సోషలిస్ట్ పార్టీ, సీపీఐలు ఒక్కోసారి సాలూరులో విజయం సాధించాయి. రాజన్న దొర 2009 నుంచి 2019 వరకు వరుసగా గెలిచి హ్యాట్రిక్ సొంతం చేసుకున్నారు. సాలూరుపై పట్టు కోల్పోకూడదని సీఎం వైఎస్ జగన్ కృతనిశ్చయంతో వున్నారు. బలమైన నేత , ప్రస్తుత డిప్యూటీ సీఎం రాజన్న దొరకు మరోసారి టికెట్ కేటాయించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా గుమ్మడి సంధ్యారాణిని ప్రకటించారు.
Andhra Pradesh Mar 28, 2024, 4:34 PM IST
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టెక్కలి సీటు చాలా కీలకంగా మారింది. ఇక్కడి నుండి రాష్ట్ర టిడిపి అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పోటీలో వున్నారు. ఆయనను ఎలాగైనా ఓడించాలన్న పట్టుదలతో వైసిపి... ఎలాగైనా మళ్లీ గెలింపించుకోవాలని టిడిపి పట్టుదలతో వున్నాయి. ఇలా ఇరుపార్టీలు టెక్కలి అసెంబ్లీని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఫలితం ఎలావుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
Andhra Pradesh Mar 28, 2024, 4:00 PM IST
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావుకే ఈసారి టికెట్ దక్కలేదు. పొత్తులొ భాగంగా ఈ సీటు బిజెపికి దక్కింది. ఇక వైసిపి మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ కు మరోసారి అవకాశం ఇచ్చింది.
Andhra Pradesh Mar 28, 2024, 2:48 PM IST
ఎలక్టోరల్ బాండ్ ఇష్యూ అధికార భారతీయ జనతా పార్టీకి భారీగా నష్టం కలిగిస్తుందని ప్రముఖ ఆర్థికవేత్త, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ అంచనా వేశారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద కుంభకోణమని ఇప్పుడు అందరికీ అర్థమవుతోందని చెప్పారు.
NATIONAL Mar 28, 2024, 11:10 AM IST
స్వతంత్ర ఎంపీ, సినీ నటి నవనీత్ రాణాకు బీజేపీ టికెట్ కేటాయించింది. మహారాష్ట్రలోని అమరావతి నుంచి ఆమెను బరిలోకి దిపింది. అయితే ఆమె అభ్యర్థిత్వాన్ని బీజేపీ అమరావతి విభాగం వ్యతిరేకించింది.
NATIONAL Mar 28, 2024, 8:09 AM IST
తన దగ్గర డబ్బులు లేవని అందుకే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అందుకే బీజేపీ అధిష్టానం చేసిన ప్రతిపాదనను తాను తిరస్కరించానని చెప్పారు.
NATIONAL Mar 28, 2024, 7:08 AM IST
నాగూరు నియోజకవర్గాన్ని 2009లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత పేరు మార్చి కురుపాంగా మార్చారు. శత్రుచర్ల విజయరామరాజు కుటుంబానిదే ఇక్కడ ఆధిపత్యం. ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా , ఆయన సోదరుడు శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు, అనంతరం ఆయన కోడలు పాముల పుష్పశ్రీవాణిలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. 2009లో నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి కురుపాంలో మూడు సార్లు ఎన్నికలు జరగ్గా.. 2009లో కాంగ్రెస్, 2014, 2019లలో వైసీపీలు విజయం సాధించాయి. కురుపాంలో హ్యాట్రిక్ విజయం నమోదు చేయాలని సీఎం వైఎస్ జగన్ కృతనిశ్చయంతో వున్నారు. మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణికి మరోసారి టికెట్ కేటాయించారు. తొయ్యపు జగదేశ్వరిని టీడీపీ అభ్యర్ధిగా ప్రకటించారు చంద్రబాబు.
Andhra Pradesh Mar 27, 2024, 10:00 PM IST
కుప్పం అంటే చంద్రబాబు.. చంద్రబాబు అంటే కుప్పం అన్నంతగా ఆయన ప్రజల్లో చెరగని ముద్రవేశారు. కుప్పం నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు, స్వతంత్రులు రెండు సార్లు, సీపీఐ ఒకసారి విజయం సాధించాయి. 1989లో చంద్రబాబు నాయుడు ఎంట్రీ తర్వాతి నుంచి కుప్పం ఆయనకు అడ్డాగా మారింది. వరుసగా 7 సార్లు చంద్రబాబు గెలుస్తూ వస్తున్నారు. 2019 ఎన్నికల నుంచి చంద్రబాబు కోటకు బీటలు వారడం మొదలైందని విశ్లేషకులు అంటున్నారు. కుప్పం నియోజకవర్గంపై గతంలో చంద్రబాబుకు ప్రత్యర్ధులుగా వున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు ఫోకస్ చేయలేదు. జగన్ మాత్రం వై నాట్ కుప్పం అంటూ ప్రత్యేక నినాదం అందుకున్నారు. చంద్రబాబుకు చిరకాల ప్రత్యర్ధిగా వున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పెషల్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.
Andhra Pradesh Mar 27, 2024, 8:31 PM IST
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అధికార బీఆర్ఎస పార్టీ నాయకుల పాత్ర ఉంటుందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఆయన డీజీపికి ఫిర్యాదు చేశారు.
Telangana Mar 27, 2024, 7:26 PM IST
చెన్నై, బెంగళూరు నగరాలకు సమీపంలో వుండటంతో వాణిజ్యపరంగా, భౌగోళికంగా పలమనేరుకు ప్రాధాన్యత ఏర్పడింది. చింతపండు, వేరుశెనగ పంటలకు పలమనేరు కేంద్రం. ఈ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. 1983లో తెలుగుదేశం ఆవిర్భవించిన తర్వాత నుంచి నేటి వరకు పలమనేరులో ఆ పార్టీ 6 సార్లు విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ 5 సార్లు, వైసీపీ 2 సార్లు, స్వతంత్ర పార్టీ ఒకసారి గెలిచాయి. పలమనేరులో హ్యాట్రిక్ సాధించాలని సీఎం వైఎస్ జగన్ కృత నిశ్చయంతో వున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎన్ వెంకటే గౌడకు టికెట్ కేటాయించారు. అమర్నాథ్ రెడ్డికి మరోసారి టికెట్ కేటాయించారు చంద్రబాబు
Andhra Pradesh Mar 27, 2024, 7:13 PM IST
2009లో నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా గతంలో వున్న వేపంజరి, పుత్తూరు నియోజకవర్గాలు రద్దయి వాటి స్థానంలో పూతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఎస్సీలకు రిజర్వ్ చేయబడిన పూతలపట్టులో మొత్తం ఓటర్ల సంఖ్య 2,21,038 మంది. 2009లో నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి మూడు సార్లు ఎన్నికలు జరగ్గా.. కాంగ్రెస్ ఒకసారి, వైసీపీ రెండు సార్లు విజయం సాధించింది. పూతలపట్టులో హ్యాట్రిక్ విజయం సాధించాలని సీఎం వైఎస్ జగన్ కృతనిశ్చయంతో వున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు బదులుగా మాజీ ఎమ్మెల్యే ఎం సునీల్ కుమార్కు జగన్ టికెట్ కేటాయించారు. సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కలికిరి మురళీమోహన్ను అభ్యర్ధిగా ప్రకటించారు.
Andhra Pradesh Mar 27, 2024, 6:08 PM IST