ఇద్దరు మహిళలను లెస్బియన్స్ అనే అనుమానంతో దాడి చేసిన బంధువులు.. ఐరన్ రాడ్తో ప్రైవేట్ పార్ట్స్ కాల్చి టార్చర్
పశ్చిమ బెంగాల్లో ఇద్దరు మహిళలు లెస్బియన్లు అని, వారిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారనే అనుమానంతో ముగ్గురు దుండగులు వారు ఉన్న ఇంటిలోకి చొరబడ్డారు. ఐరన్ రాడ్తో వారి ప్రైవేట్ పార్టులను కాల్చారు. రేప్ చేయడానికి ప్రయత్నించినట్టూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో ఓ దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు మహిళలు సాన్నిహిత్యంగా ఉండటం చూసి వారు లెస్బియన్స్ అనే అంచనాకు వచ్చి వారిపై దాడికి దిగారు. ఆ ఇద్దరిలో ఒక మహిళకు చెందిన ఇద్దరు బంధవులు, ఓ స్థానికుడు కలిసి వారిద్దరిపై దాడి చేశారు. వారి ప్రైవేట్ పార్టులను ఐరన్ రాడ్తో కాల్చారు. తొడలు, పొత్తికడుపులోనూ దాడి చేయడంతో గాయాలు అయ్యాయి. అంతేకాదు, వారి దుస్తులు తొలగించి రేప్ చేసే ప్రయత్నాలకు తెగబడినట్టు బాధితులు పేర్కొన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ముర్షిదాబాద్ జిల్లా సాగర్దిగి గ్రామంలో జరిగిన ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. ‘వారిద్దరూ కలిసి పెరిగారు. ఒకరి చెంత మరొకరు సాంత్వన పొందుతారు’ అని బాధితురాలి తల్లి చెప్పింది. ఈ ఘటన విన్న తర్వాత సాగర్దిగికి వెళ్లింది. ఆమె కూతురు అమ్మమ్మ వద్ద సాగర్దిగిలో ఉంటున్నది.
‘నేను నా ఫ్రెండ్ రోజూ కలుసుకుంటాం. కలిసే బీడీలు చుట్టుతాం. కానీ, అక్టోబర్ 25వ తేదీన ఆమెను చూడలేదు. అదే రోజు రాత్రి ఆమె నాకు ఫోన్ చేసి ఇంటికి రమ్మంది. ఆమెకు పొత్తికడుపులో తీవ్రమైన బాధ ఉన్నదని చెప్పింది’ ఓ బాధితురాలు వివరించింది. అందుకే ఆ రోజు రాత్రి అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలిపింది.
Also Read: మద్యం మత్తులో యువతుల వీరంగం .. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ మహిళపై దారుణం..
బాధితురాలికి చెందిన ఇద్దరు బంధువులు, మరో స్థానికుడు సాహెబుల్ షేక్ కలిసి తమ గదిలోకి చొరబడ్డారని, పడుకుని ఉన్న తమని చూసి ఇద్దరు ఒకే బెడ్ పై ఎందుకు పడుకున్నారని ప్రశ్నించారు. దీనికి తాము ఫ్రెండ్స్ అని చెబితే.. దాడికి పాల్పడ్డారు. వారి ప్రైవేట్ పార్టులను వేడి ఐరన్ రాడ్తో కాల్చినట్టు బాధితులు ఆరోపించారు. అంతేకాదు, ఆ గ్యాంగ్ వారి దుస్తులు తొలగించి రేప్ చేసే ప్రయత్నం కూడా చేసినట్టు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే వారి మధ్య సంబంధాన్ని మరింత ఎక్స్పోజ్ చేస్తామని బెదిరించినట్టు వివరించారు.
కాగా, బాధితుల్లో ఒకరు మాట్లాడుతూ, వారి మధ్య రిలేషన్షిప్ను అంగీకరించారు. తాము ఒక రిలేషన్షిప్లో ఉన్నామని, తమను ఎవరూ అడ్డుకోజాలరని స్పష్టం చేశారు. ఆ ముగ్గురు తమను లైంగికంగా వేధించారని, అసభ్యంగా తాకారని, రేప్ చేయడానికీ ప్రయత్నించారని వివరించారు.
మాల్దా పోలీసులు సోమవారం ముగ్గురిలో ఒకరిని ఔతువా విలేజ్లో పట్టుకున్నారు. కాదమ్, సాహెబ్ అనే ఇద్దరు నిందితులను పట్టుకోవాల్సి ఉన్నదని పోలీసువర్గాలు వివరించాయి.