Asianet News TeluguAsianet News Telugu

లవర్‌తో సీక్రెట్ ప్లేస్‌కు వెళ్లిన యువతిపై బాయ్‌ఫ్రెండ్ ముందే గ్యాంగ్ రేప్.. ఐదుగురు నిందితులు అరెస్టు

తమిళనాడులో ఓ ప్రేమ జంట రహస్యంగా మాట్లాడుకోవడానికి నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లింది. అక్కడే మద్యం సేవిస్తున్న కొందరు దుండగులు వారిని గమనించి దగ్గరికి వెళ్లారు. ఆ యువకుడిని కత్తితో బెదిరించి ఆ యువతిపై ఐదుగురు గ్యాంగ్ రేప్ చేశారు.
 

woman who went out with lover gangraped in tamilnadu, 5 accused arrested
Author
First Published Jan 14, 2023, 12:20 PM IST

చెన్నై: తమిళనాడులో దారుణ ఘటన జరిగింది. లవర్‌తో మాట్లాడుకోవడానికి నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లిన ఓ యువతిని అక్కడే ఉన్న కొందరు దుండగులు బెదిరించి గ్యాంగ్ రేప్ చేశారు. చీకటి పడటం, దుండగులు మాస్క్‌లు ధరించి ఉండటంతో వారిని బాధితులు గర్తించలేకపోయారు. కానీ, ఆ నేరానికి పాల్పడుతున్నప్పుడు గ్యాంగ్‌లో ఒకరిని విమల్ అని పిలిచినట్టు గుర్తు చేసుకుని పోలీసులకు తెలిపారు. ఆ పేరు ఆధారంగానే ఐదుగురు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన కంచీపురంలో గురువారం రాత్రి జరిగింది.

19 ఏళ్ల యువతి తన కాలేజీలోనే చదివే అబ్బాయితో ప్రేమలో ఉన్నది. రెండేళ్లుగా వారు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. బెంగళూరు, పుదుచ్చేరి ఔటర్ రింగ్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోని ఓ ప్రైవేట్ స్కూల్ దగ్గర ప్లేస్ దగ్గర వారు తరుచూ కలిసి మాట్లాడుకునేవారు. అలాగే, గురువారం కూడా అక్కడికి వెళ్లి మాట్లాడుకుంటున్నారు. అది సాయంత్రం పూట సుమారు 7 గంటల ప్రాంతం. అదే సమయంలో అక్కడ ఇద్దరు వ్యక్తులు మద్యం సేవిస్తూ ఉన్నారు. వీరిద్దరినీ చూశారు.

ఈ విషయాన్ని మరో ముగ్గురు మిత్రులకు వారు చెప్పారు. ఆ ముగ్గురూ వచ్చాక ఐసొలేటెడ్‌గా మాట్లాడుకుంటున్న జంట వద్దకు చేరుకున్నారు. కటువుగా మాట్లాడుతూ బెదిరించారు. ఆ ఐదుగురిలో ముగ్గురు వ్యక్తులు కత్తి తీసి ఆ అబ్బాయిని బెదిరించి గట్టిగా పట్టుకున్నారు. మరో ఇద్దరు ఆ యువతిని కొన్ని మీటర్ల దూరం తీసుకెళ్లారు. ఒక వేళ ఆమె ప్రతిఘటిస్తే వారిద్దరినీ చంపేసి అక్కడే పాతిపెడతామని దుండగులు బెదిరించారని కంచీపురం డీఎస్పీ పీ జూలియస్ సీజర్ తెలిపారు. ఆ తర్వాత ఐదుగురు నిందితులూ ఆ యువతిపై గ్యాంగ్ రేప్ చేశారు.

Also Read: అలాంటి పరిస్థితుల్లో ఆమెపై పలుమార్లు అత్యాచారం జరిగిందని నమ్మలేం..! నిందితుడిపై ఎఫ్ఐఆర్ కొట్టేసిన హైకోర్టు

అయితే, ఆ ఐదుగురూ మద్యం సేవించి ఉండటంతో ఆ జంట వారి నుంచి తప్పించుకోగలిగింది. ఆ ప్రాంతానికి సమీపంలో ఉండే తమ బంధువుకు అబ్బాయి ఫోన్ చేసి విషయం చెప్పాడు.  వెంటనే ఆ యువతిని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. 

ఆ యువతి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు పెట్టారు. కానీ, నిందితులను బాధితులు గుర్తించే పరిస్థితి లేదు. చీకటి పడటం, మాస్కులు ధరించి ఉండటం మూలంగా వారు గుర్తించలేకపోయారు. కానీ, ఆ గ్యాంగ్‌లోని ఒకడు మరొకడిని విమల్ అని పిలవడం గుర్తుకు వచ్చి అదే విషయాన్ని పోలీసులకు తెలిపారు.

ఆ క్లూతో పోలీసులు యాక్షన్‌లోకి దిగారు. ఆ ఏరియాలో విమల్ కుమార్ అనే 25 ఏళ్ల నిందితుడిని పట్టుకోగలిగారు. విమల్‌ను ప్రశ్నించగా.. మిగతా నలుగురు మణికందన్ (22), శివకుమార్ (20), విగ్నేశ్ (22), తెన్నరసు (23)లను అరెస్టు చేశారు. వారిపై రేప్ కేసు పెట్టి జ్యూడీషియల్ కస్టడీలోకి తీసుకున్నారు. నిందితులంతా 25 ఏళ్లులోపు వారే.

Follow Us:
Download App:
  • android
  • ios