Asianet News TeluguAsianet News Telugu

ప్రేమను నిరాకరించిందని, మత్తు ఇచ్చి బలవంతంగా పెళ్లి.. ఒప్పుకోలేదని స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారం..

ఓ యువతిని కిడ్నాప్ చేసిన యువకుడు ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. దీనికి ఆమె అంగీకరించలేదని తన స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్ చేశాడు. 

woman kidnapped and married, gang raped by lover in rajasthan
Author
First Published Nov 21, 2022, 9:53 AM IST

రాజస్థాన్ : ప్రేమ పేరుతో మహిళల మీద జరిగే అకృత్యాలకు లెక్కలేకుండా పోతోంది. ప్రేమను నిరాకరిస్తే దారుణాలకు తెగబడుతున్నారు. అలాంటి ఓ పాశవిక ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది. ఓ యువకుడు ప్రేమిస్తున్నాను అంటూ ఓ యువతిని చాలా రోజులుగా వేధిస్తున్నాడు. అతని ప్రేమను ఆమె అంగీకరించలేదు. దీంతో ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలనుకున్నాడు. దీనికోసం యువతికి మత్తు మందు ఇచ్చాడు.  ఆమె స్పృహ కోల్పోయాక తన స్నేహితులతో కలిసి కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత మత్తులో ఉన్న యువతిని ఓ గుడిలో బలవంతంగా వివాహం చేసుకున్నాడు. 

మత్తు దిగి స్పృహలోకి వచ్చిన యువతి.. తనకు జరిగిన ఘోరం చూసి.. ఆ పెళ్లికి నిరాకరించింది. దీంతో ఆ యువకుడికి కోపం వచ్చింది. పెళ్లి చేసుకున్నానని.. ఆమెకు ఎంతో ప్రేమించానని మరిచిపోయాడు. తన నలుగురు స్నేహితులతో కలిసి ఆ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ హృదయవిదారకమైన షాకింగ్ రాజస్థాన్ లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెడితే.. రాజస్థాన్లోని జైపూర్ ప్రతాప్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం జరిగింది. విమల్ అనే యువకుడు ఇక్కడి ఓ కాలనీకి చెందిన యువతిని ప్రేమ పేరుతో కొంత కాలంగా వేధిస్తున్నాడు. 

ఛత్తీస్ గఢ్ లో దారుణం.. యువతిని చంపి, మృతదేహాన్ని కారు ఢిక్కీలో కుక్కి..

అయితే, అతడి ప్రేమను ఆ యువతి అంగీకరించలేదు. ఎన్నిసార్లు అడిగినా ఆమె కాదంటుండడంతో విమల్ రెచ్చిపోయాడు.  ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. దీనికోసం తన స్నేహితులతో కలిసి ప్లాన్ వేశాడు. ఆ యువతి తాగే టీలో మత్తు మందు కలిపాడు. అది తాగిన ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. వెంటనే ఆమెను కిడ్నాప్ చేసి తన గ్రామానికి తీసుకువెళ్ళాడు. అక్కడ ఆమెను స్పృహలేని స్థితిలోనే పెళ్ళి చేసుకున్నాడు. ఆ తర్వాత కాసేపటికి మత్తు దిగి స్పృహలోకి వచ్చిన యువతి తనకు జరిగిన ఈ విషయాన్ని గమనించుకుని  షాక్ అయింది. ఆ పెళ్లిని తిరస్కరించింది.  

ఇంత కష్టపడి ఎత్తుకొచ్చి.. ప్లాన్ వేసి పెళ్లి చేసుకుంటే తనను కాదంటోందని తీవ్ర ఆగ్రహానికి గురైన విమల్.. ఆమెకు బుద్దిచెప్పాలనుకున్నాడు. తన నలుగురు స్నేహితులతో కలిసి యువతి మీద సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. వీరి బారినుంచి తీవ్ర ఘర్షణ అనంతరం బయటపడ్డ యువతి.. శనివారం సాయంత్రం జైపూర్కు చేరుకుంది. పోలీస్ స్టేషన్కు చేరుకుని తనపై జరిగిన అఘాయిత్యం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఆ యువతిని మెడికల్ చెకప్ కోసం ఆస్పత్రికి తరలించారు. ఐదుగురు నిందితుల కోసం గాలింపు ప్రారంభించారు. 

గత శుక్రవారం మధ్యాహ్నం 2:50 గంటల సమయంలో ఒక మహిళ తాళం వేసిఉన్న ఇంట్లో అపస్మారక స్థితిలో పడి ఉందని పోలీసులకు కాల్ వచ్చింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమె మరణించినట్లు గుర్తించారు. తరువాత నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. గుల్షానా తన భర్త నుంచి విడిపోయి ఏడాది వయసున్న కుమార్తెతో కలిసి ఉంటోది. శవపరీక్ష నివేదికలో ఆమె గొంతు నులిమి చంపినట్లు ధృవీకరించబడింది. సరితా విహార్ పోలీస్ స్టేషన్‌లో ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios