Freebies Supreme court: ఉచిత హామీలను అడ్డుకోలేమన్న సుప్రీం.. ఆగస్టు 22న తదుపరి విచారణ
Freebies Supreme court: ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలను అడ్డుకోలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. పార్టీలు ఇచ్చే హామీలు ఏవి ఉచితాల కిందకు వస్తాయో.. ఏవి రావో తేల్చడం కష్టమని అభిప్రాయపడింది.
Freebies Supreme court: దేశంలో ఉచిత పథకాల విషయంలో రాజకీయం జరుగుతోంది. కొన్ని పార్టీలు దీనిని ప్రజల హక్కుగా పేర్కొంటుండగా, బిజెపి ప్రభుత్వం దీనిని నిషేధించాలని డిమాండ్ చేస్తోంది. దీంతో ఈ విషయం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. దీనిపై సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఎన్నికలకు ముందు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు 'ఉచితాలు' ఇస్తామని హామీ ఇస్తున్న రాజకీయ పార్టీలపై నిషేధం విధించాలని పిటిషన్లో కోరారు. ఫ్రీబీ సంస్కృతికి స్వస్తి పలకాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది..
ఈ నేపథ్యంలో ఉచితాలను నిషేధించాలన్న డిమాండ్పై సుప్రీంకోర్టు బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. ఫ్రీబీ సమస్యపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. ఉచిత హామీల అంటే ఏమిటో నిర్వచించాలని పేర్కొంది. ఉచిత హామీల కిందకు ఏం ఏం వస్తాయి.. ఏం రావో చెప్పడం చాలా కష్టంగా మారుతోందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. CJI NV రమణ, జస్టిస్ JK మహేశ్వరి, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఉచిత హామీల అంశాన్ని తేల్చేందుకు ఓ కమిటీ వేయాలనుకుంటున్నట్లు వెల్లడించింది.
ఎన్నికల సమయంలో ఓటర్లకు ప్రభావితం చేసేలా ఉచితాల హామీలను ప్రకటిస్తున్నారనీ, అలాంటి చర్యలను నియంత్రించాలంటూ న్యాయవాది అశ్వినీకుమార్ ఉపాధ్యాయ్ వేసిన పిటిషన్పై CJI NV రమణ నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ, త్రాగునీటి సదుపాయం, విద్యను ఉచితంగా పరిగణించవచ్చా? ఫ్రీబీ అంటే ఏమిటో నిర్వచించాలి. రైతులకు ఉచితంగా ఎరువులు ఇవ్వకుండా ఆపగలమా? దీంతో శనివారం సాయంత్రంలోగా ఈ అంశంపై అన్ని పక్షాలు సూచనలు చేయాలని సీజేఐ ఆదేశిస్తూ విచారణను సోమవారానికి (ఆగస్ట్ 22కి) వాయిదా వేశారు.
రాజకీయ పార్టీలు వాగ్దానాలు చేయకుండా అడ్డుకోలేవని విచారణ సందర్భంగా సీజేఐ తెలిపారు. సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడమే ప్రభుత్వ కర్తవ్యం. ప్రజాధనాన్ని సక్రమంగా ఖర్చు చేయడమే ఇక్కడ ఆందోళన. ఈ విషయం చాలా క్లిష్టంగా ఉందన్నారు. ఈ సమస్యలపై విచారణ జరిపేందుకు న్యాయస్థానం సమర్థులా అనేది కూడా ప్రశ్న అని పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చెల్లుబాటు అయ్యే వాగ్దానమేమిటన్నదే ప్రశ్న అని సీజేఐ అన్నారు. ఉచితంగా వాహనం ఇవ్వడం సంక్షేమ చర్యగా చూడగలమా? విద్య కోసం ఉచిత కోచింగ్ ఉచితం అని చెప్పగలమా? అని ప్రశ్నించారు.
గ్రామీణ ప్రాంతాల ప్రజలకు గౌరవప్రదమైన ఉపాధిని అందించే ఎంఎన్ఆర్ఇజిఎ వంటి పథకాలు ఉన్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇలాంటి వాగ్దానాలు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతాయని తాము అనుకోనుకోవడం లేదని అన్నారు. అఫిడవిట్ను మీడియాలో ప్రచురించినందుకు మందలించారు
గత విచారణలో అఫిడవిట్ దాఖలు చేయనందుకు ఎన్నికల కమిషన్ను సుప్రీంకోర్టు మందలించింది. కమిషన్ అఫిడవిట్ మీడియాలో ప్రచురించబడినప్పుడు, మీ అఫిడవిట్ వార్తాపత్రికలో చదవాలా అని సుప్రీంకోర్టు చెప్పింది.
గత విచారణలో, ఉచితంగా ప్రకటించిన పార్టీల గుర్తింపును రద్దు చేయాలని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. దీనిపై న్యాయస్థానం ఇది మా వ్యవహారం కాదని పేర్కొంది. దీనిపై చట్టం చేయాల్సి వస్తే కేంద్ర ప్రభుత్వమే చేయాలని సుప్రీం పేర్కొంది.
విచారణ సందర్భంగా.. ఈ అంశంపై సొలిసిటర్ జనరల్ కమిటీ వేయాలని ప్రతిపాదించారు. ఈ అంశంపై ఏదో ఒక శ్వేతపత్రం రావాలని సీజేఐ అన్నారు. చర్చ జరగాలి. ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోంది. ప్రజల సంక్షేమం, రెండూ సమతుల్యంగా ఉండాలి. అందుకే ఏదో ఒక కమిటీని కోరుతున్నామని తెలిపారు.
దీని తరువాత, సొలిసిటర్ జనరల్ మాట్లాడుతూ.. ఒక కమిటీని ప్రతిపాదిస్తున్నామనీ, ఇందులో కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి, ప్రతి రాజకీయ పార్టీ ప్రతినిధి, నీతి ఆయోగ్, ఆర్బిఐ, ఫైనాన్స్ కమిషన్, జాతీయ పన్ను చెల్లింపుదారుల సంఘం ప్రతినిధిని ఉండాలని తెలిపారు.