Asianet News TeluguAsianet News Telugu

పెద్ద నోట్ల రద్దుపై 'సుప్రీం' సంచలన తీర్పు నేడే

2016లో రూ.1000, రూ.500 కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం తీర్పు వెలువరించనుంది.

SC to pronounce verdict on pleas against demonetisation on Monday
Author
First Published Jan 2, 2023, 1:23 AM IST

2016 నవంబర్‌ 8న  మోదీ ప్రభుత్వం పాత రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై పలు విమర్శలు వచ్చాయి. అంతే కాదు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో 50కి పైగా  పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం రిజర్వ్‌ చేసిన తీర్పును  సోమవారం (జనవరి 2న) వెల్లడించనున్నది. విశేషమేమిటంటే.. ఈ తీర్పు వెలువడిన మరుసటి రోజే.. జస్టిస్ అబ్దుల్ నజీర్ పదవీ విరమణ చేయనున్నారు.  
 
జస్టిస్ ఎస్ ఏ నజీర్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై జనవరి 2న తీర్పు వెలువరించనుంది. సోమవారం నాటి సుప్రీం కోర్టు కాజ్ లిస్ట్ ప్రకారం.. ఈ విషయంలో రెండు వేర్వేరు తీర్పులు ఉంటాయి, వీటిని జస్టిస్ బిఆర్ గవాయ్ , జస్టిస్ బివి నాగరత్న ప్రకటిస్తారు. ఈ రెండు నిర్ణయాలూ ఏకీభవిస్తాయా లేక భిన్నాభిప్రాయాలకు లోనవుతాయా అనేది స్పష్టంగా తెలియలేదు.


తీర్పు రిజర్వు 

అంతకుముందు.. నోట్ల రద్దు జరిగిన ఆరేళ్ల తర్వాత డిసెంబర్ 7న అత్యున్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. నోట్ల రద్దుకు సంబంధించిన అన్ని రికార్డులను తమకు అందజేయాలని కేంద్రాన్ని, భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బిఐ)ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీని తర్వాత తీర్పు రిజర్వ్ చేయబడింది. ధర్మాసనంలో న్యాయమూర్తులు బిఆర్ గవాయ్, ఎఎస్ బోపన్న, వి రామసుబ్రమణియన్, బివి నాగరత్న కూడా ఉన్నారు. సీనియర్ న్యాయవాదులు పి చిదంబరం, శ్యామ్ దివాన్‌లతో పాటు ఆర్‌బిఐ తరపు న్యాయవాది, ప్రభుత్వం తరపున న్యాయవాది అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి వాదనలను ఆయన వినిపించారు.

58 పిటీషన్లపై విచారణ

నవంబర్ 8, 2016న కేంద్రం ప్రకటించిన నోట్ల రద్దును సవాల్ చేస్తూ దాఖలైన 58 పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాది , మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం పిటిషనర్ల తరపున వాదిస్తూ.. నోట్ల రద్దు విధానాన్ని విమర్శించారు. ప్రభుత్వం అనుసరించిన ప్రక్రియ లోపభూయిష్టంగా ఉన్నాయని, లీగల్ టెండర్‌కు సంబంధించిన ఎలాంటి తీర్మానాన్ని ప్రభుత్వం స్వయంగా ప్రారంభించలేదని వాదించారు. ఇది అత్యంత దారుణమైన నిర్ణయాల ప్రక్రియ అని పేర్కొన్న మాజీ ఆర్థిక మంత్రి.. ఈ ప్రక్రియ దేశంలోని న్యాయ పాలనను అపహాస్యం చేసిందని అన్నారు.  

ఇక ప్రభుత్వం తరపున భారత అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి తన వాదనలను వినిపించారు. మోడీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని సమర్థిస్తూ.. తన వాదనలను వినిపించారు. ఆర్థిక వ్యవస్థలో ఒక వైపు పెద్ద ప్రయోజనాలు, ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు సాటిలేనివని అన్నారు. నిర్దేశిత లక్ష్యాలను అమలు చేయడంతో పెద్ద నోట్ల రద్దు విఫలమైంది. అదే సమయంలో అనవసరమైన కష్టాలను తెచ్చిపెట్టిందనడం అతి పెద్ద అపోహ అని అటార్నీ జనరల్ పేర్కొన్నారు. 

 కోర్టు అధికారిక నివేదికల డిజిటలైజ్ 

న్యాయవ్యవస్థ డిజిటలైజేషన్‌కు మరో అడుగు వేస్తూ.. సుప్రీంకోర్టు సోమవారం ఒక ప్రాజెక్ట్‌ను ప్రారంభించనుంది. దీని కింద న్యాయ విద్యార్థులు, న్యాయవాదులు, సాధారణ ప్రజలకు సుప్రీంకోర్టు తీర్పుల ఎలక్ట్రానిక్ నివేదికలను ఉచితంగా యాక్సెస్ చేయవచ్చు. సుప్రీం కోర్టు తీర్పులకు సంబంధించిన అధికారిక చట్టపరమైన నివేదిక అయిన 'సుప్రీం కోర్ట్ రిపోర్ట్స్' (SCR)లో నమోదు చేయబడిన నివేదికల డిజిటల్ కాపీని అందించే చొరవలో భాగంగా ప్రధాన న్యాయమూర్తి DY చంద్రచూడ్ ఆదేశాల మేరకు e-SCR ప్రాజెక్ట్ ప్రారంభించబడుతుంది.

వెబ్‌సైట్, యాప్‌లో అందుబాటు

1950 నుండి 2017 వరకు తీర్పులను డిజిటలైజేషన్ చేయడం, దాని డిజిటలైజ్డ్ సాఫ్ట్ కాపీని PDF ఫార్మాట్‌లో స్కాన్ చేయడం, భద్రపరచడం SCR తీర్పుల సాఫ్ట్ కాపీలను డిజిటల్ స్టోరేజ్‌లో రిజిస్ట్రీకి సహాయపడుతుందని అత్యున్నత న్యాయస్థానం ఓ ప్రకటనలో తెలిపింది. ఇ-ఎస్‌సిఆర్ ప్రాజెక్ట్ సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో ప్రారంభించబడుతుంది. ఇది కోర్టు మొబైల్ యాప్‌లో కూడా అందుబాటులో ఉంటుంది. ఇది నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ (NJDG)లో కూడా ప్రారంభించబడుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios