అద్దె ఇంట్లో ఇతర రాష్ట్రాల యువతులతో వ్యభిచారం.. నిర్వాహకుల అరెస్ట్
హోసూరులో వ్యభిచార నిర్వాహకులకు పోలీసులు అరెస్ట్ చేశారు. వేరే రాష్ట్రాల నుంచి యువతులను తీసుకువచ్చి.. అద్దెఇంట్లో ఈ వ్యవహారం నడుపుతున్నారు.
కర్ణాటక : కర్ణాటకలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటకలోని కోసూరు కార్పొరేషన్ పరిధిలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు కొంతమంది. ఆ ఇంట్లో ఇతర రాష్ట్రాల నుంచి మహిళలను తీసుకువచ్చి గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారు.. జిల్లా ఎస్పీ సరోజ్ కుమార్ ఠాగూర్ కు హోసూరు ప్రాంతంలో వ్యభిచారాలు జోరుగా సాగుతున్నాయి అన్న రహస్య సమాచారం అందింది.
ఈ వ్యవహారాన్ని కట్టడి చేయాలని.. వ్యభిచారాన్ని అడ్డుకోవాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. దీంతో హోసూరు డిఎస్పి బాబు ప్రశాంత్ నేతృత్వంలో పోలీసులు బుధవారం రాత్రి బాగలూరు రోడ్డు ప్రాంతంలో గస్తీ నిర్వహించారు. అదే సమయంలో ఓ ఇంటిపై దాడి చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించారు. ఈ విచారణలో డెంకణీకోట సమీపంలోని అంజలగిరి గ్రామానికి చెందిన శ్రీనివాస్ (25), కృష్ణగిరి భారతీపురం ప్రాంతానికి చెందిన తిరుపతి (32), బెంగళూరు బండేపాల్యం ప్రాంతానికి చెందిన మునిస్వామి (48)లు ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నట్లుగా తేలింది.
ఒడిశాలో మరో రైలు ప్రమాదం.. ఏసీ కోచ్ లో చెలరేగిన మంటలు..
వీరు ముగ్గురు ఎన్జీవో కాలనీలో ఇంటిని అద్దెకు తీసుకుని ఇతర రాష్ట్రాలకు చెందిన యువతులను తీసుకువస్తున్నారు. వారితో ఇక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా తేలింది. దీంతో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఆ ఇంట్లో వ్యభిచారానికి పాల్పడుతున్న యువతులకు విముక్తి కలిగించారు.
ఇదిలా ఉండగా, మార్చిలో ఇలాంటి దారుణ ఘటనే ఢిల్లీలో వెలుగు చూసింది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఓ సంచలన ఘటన హృదయాల్ని మెలిపెట్టేలా ఉంది. తల్లిదండ్రులు లేని తన మేనకోడలిని దగ్గరుండి కన్నకూతురుల సాదుకోవాల్సిన మేనత్త ఆమెను వ్యభిచార కూపంలోకి నెట్టింది. మైనర్ బాలికను రూ. 55 వేల రూపాయలకు ఓ వ్యక్తికి అమ్మింది. అతను బాలికను బలవంతంగా వ్యభిచారంలోకి దింపడానికి ప్రయత్నించాడు. దీంతో తనను కొన్న వ్యక్తుల నుంచి బాధితురాలు ఎలాగో తప్పించుకొని ఓఎన్జీవోను ఆశ్రయించింది.
వారి సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి…
ఢిల్లీలోని గోవింద్ పురి పోలీస్ స్టేషన్లో బాలిక వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. ఆమె వాంగ్మూలం ప్రకారం మైనర్ బాలికను కొన్న నిందితుడైన నందుని అరెస్టు చేశారు. అతనికి మేనకోడలు అని కూడా చూడకుండా అమ్మిన అత్త పరారీలో ఉంది. సదరు బాధిత బాలిక తల్లిదండ్రులు అనారోగ్యంతో మృతి చెందారు. ఎవరూ లేకపోవడంతో ఆ బాలిక మేనత్త దగ్గర ఉంటుంది. సోదరుడి కూతురిని కన్న కూతురులా చూసుకోవాల్సిన ఆమె డబ్బుల కోసం కక్కుర్తి పడింది. నందు అనే పశ్చిమబెంగాల్ కు చెందిన ఓ వ్యక్తికి రూ.55వేలకు ఆ బాలికను అమ్మేసింది.
అక్కడి నుంచి బాలికను తీసుకువెళ్లిన ఆ వ్యక్తి తన ఇంట్లోనే ఆమెతో వ్యభిచారం చేయమని ఒత్తిడి చేశాడు. ఈ మేరకు బాలిక తన వాంగ్మూలంలో తెలుపుతూ…‘తన మీద పదిమందికి పైగా అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పింది. ఈ క్రమంలోనే గత మంగళవారం కూడా ఓ వ్యక్తి బాలికను వేధించేందుకు రాగా.. అక్కడి నుంచి ఏదోలా తప్పించుకుని పారిపోయింది. ఆ తర్వాత ఓఎన్జీవో అడ్రస్ సంపాదించి వారిని కలిసింది. వారికి తన బాధను వెల్లడించి సహాయం చేయాల్సిందిగా కోరింది. దీంతో పోలీసులకు సమాచారం అందించిన ఎన్జీవో సభ్యులు.. నిందితుడైన నందును కూడా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాధితురాలికి చికిత్స నిమిత్తం పోలీసు అధికారులు ఆసుపత్రికి తరలించారు.
బాధితురాలికి వైద్య పరీక్షలు చేసిన వైద్యుల బృందం ఆమె మీద అత్యాచారం జరిగినట్లుగా నిర్ధారించడంతో.. నిందితుల మీద అత్యాచారం సహా ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తును పోలీసులు ప్రారంభించారు. బాలికను కొని వ్యభిచారంలోకి దింపిన నిందితుడైన నందును పోలీసులు అరెస్టు చేశారు. అతడిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం తెలిసిన బాలిక మేనత్త పరారీలో ఉంది. దీంతో ఆమె మొబైల్ లొకేషన్ ఆధారంగా ట్రేస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.