దేశంలోకి చైనా వచ్చినట్టే.. మేం కర్ణాటకలోకి వెళ్తాం.. రాజకీయ దుమారం రేపుతున్న సంజయ్ రౌత్ వ్యాఖ్యలు
Mumbai: దశాబ్దాల కాలం నాటి సరిహద్దు వివాదంపై మహారాష్ట్ర-కర్ణాటకల మధ్య ఇటీవల తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇరు రాష్ట్రాల నాయకులు వ్యాఖ్యలతో ఇప్పటికే ఈ అంశం హాట్ టాపిక్ గా మారగా, తాజాగా శివసేన నాయకుడు సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. కర్ణాటకలో పర్యటించేందుకు తనకు ఎవరి అనుమతి అవసరంలేదని ఆయన పేర్కొన్నారు.
Shiv Sena leader Sanjay Raut: కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దు వివాదం మరింతగా ముదురుతోంది. ఇరు రాష్ట్రాల రాజకీయ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు రోజురోజుకూ ఈ అంశాన్ని మరింతగా ఉద్రిక్తలకు దారితీసే విధంగా మారుతోంది. తాజాగా శివసేన నాయకుడు సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేసుతున్నాయి. కర్ణాటకలో పర్యటించేందుకు తనకు ఎవరి అనుమతి అవసరం లేదని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సేన వర్గ సభ్యుడు సంజయ్ రౌత్.. చైనా మన దేశంలోకి ప్రవేశించినట్లే కర్ణాటకలోకి ప్రవేశిస్తాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వివరాల్లోకెళ్తే.. కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దు వివాదంలో శివసేన నాయకుడు సంజయ్ రౌత్ బుధవారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. ‘చైనా మన దేశంలోకి ప్రవేశించినట్లే కర్ణాటకలోకి ప్రవేశిస్తాం’ అని చెప్పడం పెద్ద వివాదానికి దారితీసింది. అలా చేయడానికి తనకు ఎవరి అనుమతి అవసరం లేదని అన్నారు. కర్ణాటకలో పర్యటించేందుకు తనకు ఎవరి అనుమతి అవసరం లేదని పేర్కొన్న రౌత్.. మహారాష్ట్రలో బలహీనమైన ప్రభుత్వం ఉందనీ, సరిహద్దు వివాదం అంశంపై ఎటువంటి వైఖరి తీసుకోవడం లేదని మండిపడ్డారు. శివసేన రెబల్ నాయకుడు ఏక్ నాథ్ షిండే తిరుగుబాటులో అధికారం కోల్పోయిన ఉద్దవ్ థాక్రే వర్గం.. ఇటీవల బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే వర్గంపై తీవ్ర స్థాయిలో విమర్శలదాడి చేస్తోంది. ఈ క్రమంలోనే సరిహద్దు వివాదం అంశం క్రమంలో మరోసారి మహారాష్ట్ర సర్కారుపై విమర్శలు చేసింది. కర్ణాటకకు వ్యతిరేకంగా బలమైన వైఖరిని తీసుకోవడం లేదని ఆరోపించింది.
1956లో అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం కర్ణాటకతో సరిహద్దును పునర్నిర్మించాలని డిమాండ్ చేయడంతో సరిహద్దు వివాదం మొదలైంది. బెల్గాం, కార్వార్, నిప్పానితో సహా 865 గ్రామాలను కర్ణాటకకు ఇచ్చామని మహారాష్ట్ర వాదిస్తోంది. ఈ వాదనను కర్ణాటక తోసిపుచ్చింది. పెద్ద సంఖ్యలో మరాఠీ మాట్లాడే జనాభాను కలిగి ఉన్న బెలగావి, వాస్తవానికి మహారాష్ట్రకు దారితీసిన బొంబాయి ప్రెసిడెన్సీలో భాగంగా ఉంది. ప్రస్తుతం రెండు రాష్ట్రాల సరిహద్దు వివాదం సుప్రీంకోర్టుకు చేరుకున్న సంగతి తెలిసిందే. కర్ణాటకలోని దక్షిణ షోలాపూర్, అక్కల్కోట్ ప్రాంతాలు కూడా గణనీయమైన సంఖ్యలో కన్నడ మాట్లాడే జనాభాను కలిగి ఉన్నాయని కర్ణాటక పేర్కొంది. 1966లో మహాజన్ కమిషన్ అనే ప్రభుత్వ ప్యానెల్ బెల్గాంపై మహారాష్ట్ర వాదనను తిరస్కరించింది. కొన్ని ప్రాంతాల మార్పిడితో కూడిన పరిష్కారాన్ని ప్రతిపాదించింది, దీనిని రాష్ట్రం తిరస్కరించింది.. అయితే, కర్ణాటక దీనిని స్వాగతించింది.
పరిష్కారం కోసం అనేక ప్రయత్నాలు చేసిన తరువాత, మహారాష్ట్ర 2004 లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బెల్గాం పేరును బెలగావిగా మార్చడం ద్వారా కర్ణాటక ఈ చర్యను ప్రతిఘటించింది. ఈ ప్రాంతంపై తన వాదనను నిర్ధారించడానికి జిల్లాలో రెండవ శాసనసభను నిర్మించింది. ఐదు దశాబ్దాల సరిహద్దు వివాదం ఇటీవల ఇరు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు ఇరు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో ఒకరిపై ఒకరు పోటీపడుతూ మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాల పట్ల తన నిబద్ధతను ప్రదర్శించడానికి ఆసక్తిగా ఉన్న సీఎం ఏక్నాథ్ షిండే, న్యాయ-రాజకీయ పోరాటాన్ని పెంచడానికి ఇటీవల ఇద్దరు సీనియర్ మంత్రుల కమిటీ నియమించారు. వెంటనే, రెండు రాష్ట్రాలు వివాదాస్పద ప్రాంతాల్లోని ప్రజలను ఆకర్షించడానికి చర్యలను ప్రకటించాయి. నాయకులు రెచ్చగొట్టే వాక్చాతుర్యాన్ని పెంచడం ప్రారంభించారు. దీంతో ఇది పొలిటికల్ వార్ కు దారితీసింది.
కర్ణాటకలోని బెళగావి, మహారాష్ట్రలోని పూణేలో రాజకీయ కార్యకర్తలు రెండు రాష్ట్రాల బస్సులపై రాళ్లు రువ్వి పెయింట్ వేసిన ఘటన తర్వాత ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. ఈ క్రమంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం అయ్యారు.