అమెరికా, చైనా మధ్య సుంకాల ఉద్రిక్తత కొనసాగుతోంది. అమెరికా ఒక అడుగు ముందుకు వేస్తే చైనా రెండు అడుగులు వేస్తా అన్నట్లు పరిస్థితులు మారాయి. తాజాగా చైనా అమెరికాకు షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే సెమీకండక్టర్ల తయారీలో ఉపయోగించే అరుదైన లోహాల ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించేందుకు సిద్ధమైంది. దీనివల్ల అమెరికా ఐటీ రంగానికి గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు..