ప్రజాస్వామ్య విజయం: ప్రభుత్వ ఏర్పాటుకు యడ్డీ రెడీ
విశ్వాస పరీక్షలో కుమారస్వామి ఓటమి పాలు కావడంపై బీజేపీ హర్షం వ్యక్తం చేసింది. విశ్వాస పరీక్షలో కుమారస్వామి సర్కార్ ఓటమి పాలు కావడం ప్రజాస్వామ్య విజయంగా బీజేపీ అభివర్ణించింది.
బెంగుళూరు: కుమారస్వామి విశ్వాస పరీక్షలో ఓడిపోవడం ప్రజాస్వామ్య విజయంగా మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత యడ్యూరప్ప ప్రకటించారు.
BS Yeddyurappa, BJP: It is victory of democracy. People were fed up with Kumaraswamy government. I want to assure people of Karnataka that a new era of development will start now. pic.twitter.com/JmVrtTa9SK
— ANI (@ANI) July 23, 2019
మంగళవారంనాడు అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో కుమారస్వామి ఓటమి పాలైన తర్వాత ఆయన యడ్యూరప్ప మీడియాతో మాట్లాడారు. కుమారస్వామి పాలనతో ప్రజలు విసిగిపోయారని యడ్యూరప్ప అభిప్రాయపడ్డారు. ఇక నుండి రాష్ట్రంలో కొత్త తరహ అభివృద్ది సాగుతోందని యడ్యూరప్ప చెప్పారు.
రైతుల సంక్షేమం కోసం తాము అధికంగా ప్రాధాన్యత ఇస్తామని బీజేపీ నేత యడ్యూరప్ప ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు చూస్తే ప్రభుత్వ ఏర్పాటుకు యడ్యూరప్ప అన్ని ఏర్పాట్లు చేసుకొన్నట్టుగా కన్పిస్తోంది.రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం అందిస్తామని బీజేపీ ప్రకటించింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన బీజేపీ ట్విట్టర్ వేదికగా ఈ వ్యాఖ్యలు చేసింది.
కర్ణాటక అసెంబ్లీ లైవ్ : సోనియాగాంధీ కోరితేనే సీఎం అయ్యానన్న కుమారస్వామి
కర్ణాటక క్రైసిస్: అపార్టుమెంటు వద్ద ఆందోళన, చూడండి (వీడియో)
కర్ణాటక క్రైసిస్: ఇద్దరు ఎమ్మెల్యేల కోసం బీజేపీ,కాంగ్రెస్ కార్యకర్తల ఘర్షణ
కర్ణాటక సంక్షోభం: బెంగళూరులో 144వ సెక్షన్, వైన్ షాపులు బంద్
కర్ణాటక క్రైసిస్: అసెంబ్లీలో హై డ్రామా, నేడే బల పరీక్ష
కర్ణాటక క్రైసిస్: జోక్యం చేసుకోలేమన్న సుప్రీం
నా రాజీనామా నాజేబులోనే ఉంది, లేఖ చూపిస్తూ కీలక వ్యాఖ్యలు
బీజేపీలా కొనుగోలు చేయలేదు, మావాళ్లే వెన్నుపోటు పొడిచారు: కుమారస్వామి