కర్ణాటక క్రైసిస్: జోక్యం చేసుకోలేమన్న సుప్రీం
కర్ణాటక అసెంబ్లీలో విశ్వాస పరీక్షపై చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు స్పస్టం చేసింది.
న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఇవాళ బలపరీక్ష పూర్తయ్యే అవకాశం ఉందని కోర్టు అభిప్రాయపడింది. రెబెల్స్ పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
మంగళవారం నాడు ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేసింది. ఇవాళే అసెంబ్లీలో బల పరీక్ష చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును కోరారు.
ఈ తరుణంలో సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఉద్దేశ్యపూర్వకంగానే స్పీకర్ రమేష్ కుమార్ విశ్వాస పరీక్షను వాయిదా వేస్తున్నారని ప్రధాన న్యాయమూర్తి దృష్టికి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల తరపు న్యాయవాది తీసుకొచ్చారు.
బలపరీక్షపై చర్చ జరుగుతున్న సమయంలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయమై తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఇవాళ బల పరీక్ష పూర్తి కాకపోతే ఈ పిటిషన్పై రేపు విచారణ చేస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ పిటిషన్ పై విచారణను కోర్టు బుధవారానికి వాయిదా వేసింది.
సంబంధిత వార్తలు
కర్ణాటక క్రైసిస్: అసెంబ్లీలో హై డ్రామా, నేడే బల పరీక్ష