దారుణం.. ట్యూషన్ చెప్పేందుకు వెళ్లిన టీచర్ పై నెలల పాటు డాక్టర్ అత్యాచారం..
తన పిల్లలకు ట్యూషన్ చెప్పేందుకు వచ్చే టీచర్ పై ఓ డాక్టర్ నెలల తరబడి అత్యాచారం చేశాడు. బాధితురాలు గర్భం దాల్చడంతో ఆమెకు గర్భస్రావం జరిగేందుకు మందులు కూడా అందించాడు. దీంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది. కుటుంబ సభ్యుల సాయంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అతడో డాక్టర్. సమాజంలో మంచి గౌరవం, హోదా ఉంది. అలాంటి వ్యక్తి నీచానికి ఒడిగట్టాడు. తన పిల్లలకు ట్యూషన్ చెప్పేందుకు వచ్చే టీచర్ పై నెలల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెకు తెలియకుండా ఫొటోలు తీసి, మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేశాడు. దీంతో పోలీసులు ఆమె పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ఇందిరానగర్ లో నివాసం ఉండే 50 ఏళ్ల డాక్టర్ కొన్ని నెలలుగా ట్యూషన్ టీచర్ పై అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనం రేపుతోంది. డాక్టర్ పిల్లలకు ట్యూషన్ చెప్పడానికి ఓ టీచర్ అతడి ఇంటికి వచ్చేది. ఆ సమయంలో ఆ డాక్టర్ టీచర్ పై కన్నేశాడు. ఆ సమయంలో ఆమెకు తెలియకుండా కొన్ని ఫొటోలు తీశాడు. వాటిని అసభ్యకరంగా ఎడిట్ చేసి, వాటిని చూపిస్తూ బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారని బాధితురాలు ఆరోపించారు.
మార్ఫింగ్ చేసి ఫొటోలు, వీడియోలు చూపించి ఆమెను బెదిరించి నెలల తరబడి అత్యాచారం చేస్తూనే ఉన్నా డు. దీంతో బాధితురాలు గర్భం దాల్చింది. ఆ గర్భం పోయేందుకు డాక్టర్ ఆమెకు మందులు ఇచ్చాడు. ఆ మందుల ప్రభావం వల్ల ఆమె ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఏం జరిగిందని ఆరా తీశారు. తనపై కొన్ని నెలలుగా జరుగుతున్న దారుణ ఘటనను ఆమె వారికి తెలిపింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. డాక్టర్ పై ఫిర్యాదు చేశారు.
లక్నో నార్త్ జోన్ డీసీపీ ఎస్ చినప్ప తెలిపిన వివరాల ప్రకారం.. పిల్లలకు ట్యూషన్ చెప్పే సమయంలో ఎక్కడి నుంచో నిందితుడు ఫొటోలు తీసి బ్లాక్ మెయిల్ చేశాడని, తరువాత శారీరకంగా టీచర్ ను వేధించాడని చెప్పారు. బాధితురాలిని గదిలో బంధించి అత్యాచారం చేశారని తెలిపారు. ఆ సమయంలో వీడియో తీసి దాని ద్వారా కూడా బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డారని చెప్పారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని అన్నారు. నిందితుడి వయస్సు 50 సంవత్సరాలని తెలిపారు.
BJP leader Eshwarappa: "మొఘలుల పాలనలో 36వేల హిందూ ఆలయాల ధ్వంసం" : బీజేపీ మాజీ మంత్రి
ఇదిలా ఉండగా.. తెలంగాణలోని ఖమ్మంలో మార్చి నెలలో ఓ టీచర్ పై మరో టీచర్ అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం గూడెం పాఠశాలలో బాణోతు కిశోర్ అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన భార్య కూడా టీచరే. ఖమ్మంలో నివసించే వారు ఇద్దరూ కారులో పాఠశాలకు వెళ్ళి వస్తుంటారు. అదే మండలంలో పనిచేస్తూ ఖమ్మంలో నివసించే ఓ ఉపాధ్యాయురాలు నిత్యం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ వరకు ప్యాసింజర్ రైలులో, అక్కడినుంచి ద్విచక్ర వాహనంపై విధులకు వెళ్లి వస్తూ ఉంటుంది. ఆ నెలలో 16 నుంచి పాఠశాలలు ఒంటిపూట నిర్వహిస్తున్నారు.
మార్చి 17న ఇంటికి తిరిగి వచ్చేందుకు రైల్వేస్టేషన్లో వేచి ఉన్న సదరు మహిళా ఉపాధ్యాయురాలిని తన భార్య కూడా వస్తుందని నమ్మించి కారు ఎక్కించుకున్నాడు సదరు ఉపాధ్యాయుడు. ఆ తరువాత ఆమెను చంపుతానని బెదిరించి సెల్ ఫోన్ లాక్కున్నాడు. మార్గమధ్యలో పాండురంగాపురంలోని ఓ ఇంటికి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.. ఎవరికైనా చెబితే ఆమె భర్తను, పిల్లలను చంపుతానని బెదిరించాడు. దీంతో విషయం ఎవరికీ చెప్పలేదు. అయితే తీవ్రంగా మదన పడిన ఆమె తరువాతి రోజు విషయం తన భర్తకు తెలిపింది. వెంటనే భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.