ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ రద్దు వంటి అంశాలను బాహాటంగానే కాంగ్రెస్ నేతలు సమర్ధిస్తున్నారు. తాజాగా ఏఐసీసీ అధ్యక్ష రేసులో ఉన్న జ్యోతిరాదిత్య సింధియా సైతం కాంగ్రెస్ పార్టీతో విభేదించారు. ఎన్డీయే ప్రభుత్వ నిర్ణయానికి మద్దతిచ్చారు. జమ్ముకశ్మీర్ విభజనకు తన సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ట్విట్టర్ వేదికగా తన నిర్ణయాన్ని ప్రకటించారు.
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జమ్మూకశ్మీర్ విభజన బిల్లు కాంగ్రెస్ పార్టీని ఓ కుదుపు కుదిపేస్తున్నాయి. జమ్ముకశ్మీర్ విభజన బిల్లు నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో కల్లోలం నెలకొంది.
ప్రత్యర్థి పార్టీ బీజేపీ బిల్లు పాస్ చేసే పనిలో ఉంటే కాంగ్రెస్ పార్టీలో మాత్రం అంతర్గత కుమ్ములాటలు బయటపడ్డాయి. కేంద్ర నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీకి సొంత పార్టీ నేతలు వరుసగా షాక్ లపై షాక్ లు ఇస్తున్నారు.
ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ రద్దు వంటి అంశాలను బాహాటంగానే కాంగ్రెస్ నేతలు సమర్ధిస్తున్నారు. తాజాగా ఏఐసీసీ అధ్యక్ష రేసులో ఉన్న జ్యోతిరాదిత్య సింధియా సైతం కాంగ్రెస్ పార్టీతో విభేదించారు. ఎన్డీయే ప్రభుత్వ నిర్ణయానికి మద్దతిచ్చారు. జమ్ముకశ్మీర్ విభజనకు తన సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ట్విట్టర్ వేదికగా తన నిర్ణయాన్ని ప్రకటించారు.
ఇకపోతే రాజ్యసభలో జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లును ప్రవేశపెట్టిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తీరుపై అసహనం వ్యక్తం చేశారు ప్రభుత్వ చీఫ్ విప్ భువనేశ్వర్ కలిటా. జమ్ముకశ్మీర్ బిల్లుపై పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చీఫ్ విప్ పదవికి రాజీనామా చేశారు.
అంతేకాదు తన ఎంపీ పదవికి సైతం రాజీనామా చేశారు. భువనేశ్వర్ కలిటా రాజీనామాను రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు వెంటనే ఆమోదించడం కూడా చకచకా జరిగిపోయింది. తాజాగా ఏఐసీసీ అధ్యక్ష రేసులో ఉన్న సింధియానే పార్టీ అధ్యక్షుడు రాహుల్తో విబేధించడం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
జ్యోతిరాదిత్య సింధియా మధ్యప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైన నేత. ప్రస్తుతం గుణ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తున్నారు.
అంతేకాదు గత ఏడాది జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో జ్యోతిరాదిత్య సింధియానే సీఎం అవుతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే సీనియారిటీ దృష్ట్యా ఆ పదవిని కమల్ నాథ్ తన్నుకుపోయారు.
ఇకపోతే సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. తాను అధ్యక్షపదవి నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. ఆ తర్వాత ఏఐసీసీ అధ్యక్ష పదవిపై పలు పేర్లు వినిపించాయి. వారిలో జ్యోతిరాదిత్య సింధియా ఒకరు కావడం విశేషం. అలాంటి వ్యక్తి పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి
కాంగ్రెస్ కు ఝలక్: ఆర్టికల్ 370 రద్దుకు ఎమ్మెల్యే జగ్గారెడ్డి మద్దతు
సొంత పార్టీకి షాక్.. కేంద్రం నిర్ణయానికి జైకొట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
ఇండియాను చైనాలా, కశ్మీర్ ను పాలస్తీనాలా మారుస్తారా?: ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం
కాశ్మీర్ విభజనను వ్యతిరేకిస్తే దేశ ద్రోహులుగా చూస్తున్నారు: నామా
పార్లమెంట్లో అబద్దాలు: అమిత్ షా పై ఫరూక్ అబ్దుల్లా
ఆర్టికల్ 370 రద్దు: సుప్రీంకోర్టులో పిటిషన్
కాశ్మీర్ విభజన బిల్లు: లోక్సభ నుండి టీఎంసీ వాకౌట్
కాశ్మీర్ విషయంలో భారత్ విజయం... పాక్ కి లభించని మద్దతు
రాజ్యాంగ స్పూర్తికి విరుద్దం: జమ్మూ కాశ్మీర్ విభజనపై రాహుల్
కాశ్మీర్ విభజన: ఎపి విభజనపై కాంగ్రెస్ కు అమిత్ షా చురకలు
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Aug 6, 2019, 8:21 PM IST