కాంగ్రెస్ కు ఝలక్: ఆర్టికల్ 370 రద్దుకు ఎమ్మెల్యే జగ్గారెడ్డి మద్దతు
ఆనాడు నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ గానీ హోంమంత్రి అమిత్ షా ఉన్న అలాంటి నిర్ణయంమే తీసుకుంటారని చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మోదీ, అమిత్షా తీసుకున్న నిర్ణయం సరైనవేనని అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్: జమ్ముకశ్మీర్ కు ప్రత్యేకప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370, ఆర్టికల్ 35 ఏ రద్దు చేయడంపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమర్థించారు. జమ్ముకశ్మీర్ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా నిర్ణయాన్ని జగ్గారెడ్డి స్వాగతించారు.
జమ్ముకశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే బీజేపీపై సెటైర్లు వేశారు. 1950లో నాటి పరిస్థితుల దృష్ట్యా నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
ఆనాడు నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ గానీ హోంమంత్రి అమిత్ షా ఉన్న అలాంటి నిర్ణయంమే తీసుకుంటారని చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మోదీ, అమిత్షా తీసుకున్న నిర్ణయం సరైనవేనని అభిప్రాయపడ్డారు.
పార్లమెంటులో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్షాలు జమ్ముకశ్మీర్ పునర్ విభజన బిల్లుపై చర్చ సందర్భంగా నెహ్రూపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఆనాడు 540 సంస్థానాలు ఉండేవని వాటిలో హైదరాబాద్ సంస్థానం నిజాం పాలనలో కశ్మీర్ జునగర్ అధీనంలో ఉండేదని గుర్తు చేశారు.
భారతదేశంలో విలీనం కావడానికి హైదరాబాద్ నిజాం నవాబు ఒప్పుకోలేదని కానీ ప్రజలు భారత్ లో కలవడానికి సిద్ధం అయ్యారని తెలిపారు. కశ్మీర్ రాజు భారత్లో విలీనం కావడానికి ఒప్పుకున్నాడని గానీ ప్రజలు మాత్రం ఒప్పుకోలేదని గుర్తు చేశారు.
నిజాం ఒప్పుకోకపోవడంతో పటేల్ రంగంలో దిగారని ఆయన్ని ఒప్పించి సంస్థానాన్ని భారత్లో కలుపుకున్నారని తెలిపారు. కశ్మీర్ ప్రజలు పాకిస్తాన్లో కలవడానికి ఇష్టపడ్డారని ఆ పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్ నుంచి కశ్మీర్ను కాపాడటం కోసం నెహ్రూ ఆర్టికల్ 370, 35A తీసుకొచ్చినట్లు చెప్పుకొచ్చారు.
ఒకవేళ ఆ వెసులుబాటు కల్పించకపోతే ప్రజలకు ఇబ్బందులు కలిగేవని తెలిపారు. అప్పుడేం జరిగిందో ఇప్పుడున్న వాళ్లకు తెలియదన్నారు. ఒకవేళ పాకిస్థాన్ కశ్మీర్ను ఆక్రమించుకుంటే ఇప్పుడు చాలా ఇబ్బంది పడే వాళ్లమన్నారు.
అప్పుడున్న పరిస్థితుల్లో మోదీ, షా కూడా అలాంటి నిర్ణయాలే తీసుకునేవాళ్లని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ఎప్పుడూ సెక్యులర్ పార్టీయేనంటూ స్పష్టం చేసిన జగ్గారెడ్డి ఓటు బ్యాంకు రాజకీయాలు ఎప్పుడూ చేయలేదన్నారు. సీట్ల కోసం విధానాలకు భిన్నంగా కాంగ్రెస్ ప్రవర్తించదని స్పష్టం చేశారు.
బీజేపీ ఒక మతానికి చెందిన పార్టీ అని ఆరోపించారు. ఆర్టికల్ 370, 35A రద్దు చేయాలని ఆర్ఎస్ఎస్ ముందు నుంచి నిర్ణయించుకున్నాయని ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో దాన్ని ఇప్పుడు అమలు చేశారని చెప్పుకొచ్చారు. ఆనాటి పరిస్థితుల దృష్ట్యా కశ్మీర్ ను కాపాడేందుకు నెహ్రూ కీలక పాత్ర పోషిస్తే నేడు కశ్మీర్ ను కాపాడేందుకు ప్రధాని మోదీ, అమిత్ షాలు ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఇండియాను చైనాలా, కశ్మీర్ ను పాలస్తీనాలా మారుస్తారా?: ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం
కాశ్మీర్ విభజనను వ్యతిరేకిస్తే దేశ ద్రోహులుగా చూస్తున్నారు: నామా
పార్లమెంట్లో అబద్దాలు: అమిత్ షా పై ఫరూక్ అబ్దుల్లా
ఆర్టికల్ 370 రద్దు: సుప్రీంకోర్టులో పిటిషన్
కాశ్మీర్ విభజన బిల్లు: లోక్సభ నుండి టీఎంసీ వాకౌట్
కాశ్మీర్ విషయంలో భారత్ విజయం... పాక్ కి లభించని మద్దతు
సొంత పార్టీకి షాక్.. కేంద్రం నిర్ణయానికి జైకొట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
రాజ్యాంగ స్పూర్తికి విరుద్దం: జమ్మూ కాశ్మీర్ విభజనపై రాహుల్
కాశ్మీర్ విభజన: ఎపి విభజనపై కాంగ్రెస్ కు అమిత్ షా చురకలు
ఆక్రమిత కాశ్మీర్ పై అమిత్ షా సంచలన ప్రకటన
లోక్సభలో కాశ్మీర్ విభజన బిల్లు ప్రవేశపెట్టిన అమిత్ షా