MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Life
  • Spiritual
  • ముక్కోటి ఏకాదశి రోజు ఈ వ్రతం తప్పకుండా ఆచరించాలి

ముక్కోటి ఏకాదశి రోజు ఈ వ్రతం తప్పకుండా ఆచరించాలి

ముక్కోటి ఏకాదశి రోజు అందరూ విష్ణుమూర్తిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటారు కదా. అందరూ ఇలా దర్శనం చేసుకోవడానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తారు. కాని ముక్కోటి ఏకాదశి రోజు ఆచరించే వ్రతం ఒకటుంది. ఆ వ్రతం ఏమిటి? ఎలా ఆచరించాలి? పూజా విధానం ఏమిటి? ఇలాంటి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Jan 09 2025, 11:38 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ముక్కోటి ఏకాదశి రోజు ఆచరించే వ్రతాన్ని వైకుంఠ ఏకాదశి వ్రతం అంటారు. ఈ వ్రతం అత్యంత పవిత్రమైనది. ఈ వ్రతం ద్వారా పాప విమోచనం పొందుతూ మోక్షాన్ని అందుకోవచ్చని భక్తులు నమ్ముతారు. ఈ వ్రతాన్ని నిర్విఘ్నంగా పాటించడానికి ముఖ్యంగా ఈ విధానం అనుసరించాలి.
 

వైకుంఠ ఏకాదశి వ్రత విధానం

1. ఉపవాసం:

సాధారణంగా వ్రతం అంటే ఓ ప్రత్యేక పూజ. కాని వైకుంఠ ఏకాదశి వ్రతం అంటే ఉదయం నుంచి రాత్రి వరకు కొన్ని నియమాలు పాటిస్తూ ఆ రోజు గడపడం. ఇందులో ప్రధాన భాగం ఉపవాసం. అంటే నిష్ఠగా ఫాస్టింగ్ చేయాలి. దీని కోసం మీరు ఉదయం పూట స్నానం చేసి, కొత్త బట్టలు కట్టుకోవాలి. లేదా ఉతికి శుభ్రం చేసిన బట్టలు కూడా ధరించవచ్చు. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఉపవాసంలో గోధుమ రవ్వ, పండ్లు, పాలు లాంటి సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. మీకు శక్తి ఉంటే ఆహారం తీసుకోకుండా ఉపవాసం చేస్తే మరింత శ్రేయస్కరమని పండితులు చెబుతున్నారు. అయితే అనారోగ్య సమస్యలు ఉన్న వారు కటిక ఉపవాసాలు చేయడం మంచిది కాదని కూడా పండితులు చెబుతున్నారు. భగవంతుడి ధ్యానం, భజన, స్తోత్ర పఠనం చేయడానికి అవసరమైన శక్తిని మీరు కలిగి ఉండేలా ఉపవాసం చేయాలని సూచిస్తున్నారు. అందుకే ఎవరి శక్తి మేరకు వారు ఆహార నియమాలు పాటిస్తూ వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని కోరుతున్నారు. రాత్రి భోజనం చేయకుండా, జాగరణ చేయడం మరింత ఉత్తమ ఫలితాలను అందిస్తాయట. 

35

2. విష్ణు పూజ:

శ్రీ మహావిష్ణువు విగ్రహం లేదా ఫోటోను శుభ్రంగా ఉంచి పూలు, దండలతో అలంకరించాలి. సుదర్శన చక్రం లేదా తులసి మాల ధరించిన శ్రీ మహావిష్ణువు రూపాన్ని పూజించడం శ్రేయస్కరం. ఓం నమో నారాయణాయ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. విష్ణు సహస్రనామ పారాయణం లేదా భగవద్గీత చదవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయట.

3. తులసి సమర్పణ:

పూజలో తులసి దళాలను ఉపయోగించడం అత్యంత ముఖ్యమైన విషయం. స్వామి వారికి తులసి దళాలంటే చాలా ఇష్టమట. అందువల్ల వైకుంఠ ఏకాదశి నాడు తులసి దళాలు, దండలు సమర్పిస్తే తొందరగా స్వామి వారి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఈ విధంగా విష్ణు మూర్తికి తులసి పూలమాలలు సమర్పించి కర్పూర హారతి ఇవ్వాలి.

45

4. ఆలయ సందర్శన:

వైకుంఠ ద్వార దర్శనం పొందడం వ్రతంలో ముఖ్య భాగం. ఆ రోజు విష్ణాలయానికి వెళ్లి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వైకుంఠ ద్వారంలోంచి వెళ్లి స్వామి వారిని దర్శిస్తే మోక్షం కలుగుతుందని పురాణాల ద్వారా తెలుస్తోంది. 

5. దానం:

వైకుంఠ ఏకాదశి రోజు ఆహారం, వస్త్రాలు, లేదా ధనాన్ని దానం చేయడం పుణ్యఫలాలను అందిస్తుందట. మీరు ఏది దానం చేస్తున్నా భగవంతుని స్మరించుకుంటూ ఇవ్వాలని పండితులు చెబుతున్నారు.
 

55

6. రాత్రి జాగరణ:

రాత్రి నిద్రపోకుండా భగవంతుని కీర్తనలు పాడుతూ, మంత్ర జపం చేస్తూ ఉండాలి. ఈ విధంగా వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి నారాయణుడి కృప కలుగుతుందని భక్తుల నమ్మకం. 

వైకుంఠ ఏకాదశి వ్రత ఫలితం కారణంగా జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయట. విష్ణు కృపతో మోక్షం లభిస్తుందట. భక్తి భావన పెరిగి, జీవితం పవిత్రంగా మారుతుందని పురాణాల్లో ఉంది. 

గమనిక:

వ్రతం అనేవి భక్తి, నమ్మకంతో పాటిస్తే మరింత ఫలప్రదమవుతుంది. మీరు వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని మీ ఆరోగ్యం, శరీరం సహకరించే విధంగానే చేయాలి. కఠిన నియమాలు పాటించి ఆరోగ్యం పాడుచేసుకోవడం మంచిది కాదు. ఆరోగ్యం, భక్తి, శ్రద్ధ లేకుండా చేసే ఏ పూజా ఫలితాలనివ్వవని పండితులు చెబుతున్నారు. 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image2
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Recommended image3
Vastu Plants: మనీ ప్లాంట్ ఒక్కటే కాదు.. ఇంట్లో ఈ మొక్కలున్నా అదృష్టమే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved