MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Instability Around India: బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్.. భారత్ చుట్టూ ఎందుకీ అస్థిరత. భార‌త్‌పై ప్ర‌భావం దీని ఏంటి? బిగ్ స్టోరీలో ఆస‌క్తిక‌ర విష‌యాలు.

Instability Around India: బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్.. భారత్ చుట్టూ ఎందుకీ అస్థిరత. భార‌త్‌పై ప్ర‌భావం దీని ఏంటి? బిగ్ స్టోరీలో ఆస‌క్తిక‌ర విష‌యాలు.

Instability Around India: భార‌త దేశానికి చుట్టూ ఇటీవ‌ల రాజ‌కీయ అస్థిర‌త పెరుగుతోంది. బంగ్లాదేశ్‌, శ్రీలంక‌, నేపాల్‌లో ప్ర‌జ‌లు రోడ్ల‌పైకి వ‌చ్చి అక్క‌డి ప్ర‌భుత్వాలను కూల్చేశారు. ఈ నేప‌థ్యంలో అస‌లీ స‌మస్య‌లు ఎందుకు వ‌చ్చాయి.? 

3 Min read
Author : Narender Vaitla
Published : Sep 13 2025, 12:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
భార‌త్ చుట్టూ పెరుగుతోన్న అస్థిర‌త
Image Credit : Getty

భార‌త్ చుట్టూ పెరుగుతోన్న అస్థిర‌త

ఇటీవ‌లి కాలంలో భార‌త్ పొరుగు దేశాల్లో రాజ‌కీయ అస్థిర‌త పెరిగింది. రాజకీయ ఉత్కంఠ, ఆర్థిక సంక్షోభాలకు వేదికైంది. భారత్ పొరుగున మూడు దేశాల్లో ప్రభుత్వాలు కూలిపోయాయి — శ్రీలంక (2022లో ఆర్థిక సంక్షోభం తర్వాత అధ్యక్షుడు రాజీనామా), బంగ్లాదేశ్ (2024లో హింసాత్మక తిరుగుబాటు తర్వాత షేక్ హసీనా పదవీచ్యుతి), ఇప్పుడు నేపాల్ (2025లో కేపీ శర్మ ఓలీ రాజీనామా). ఈ మూడు సంఘటనలు ఒకే విషయాన్ని సూచిస్తున్నాయి భారత్ చుట్టూ రాజకీయ అస్తిరత పెరుగుతోంది. నేపాల్‌లో ఇటీవల జరిగిన నిరసనలు, ప్రభుత్వ కూలిపోవడం కేవలం ఒక అంతర్గత సమస్య కాదు. ఇది దక్షిణాసియా భౌగోళిక రాజకీయాలపై, భారత్ భద్రతపై, వాణిజ్య మార్గాలపై నేరుగా ప్రభావం చూపుతుంది.

28
నేపాల్‌లో ఏం జ‌రిగింది.?
Image Credit : @ShahBalen/X

నేపాల్‌లో ఏం జ‌రిగింది.?

2025 సెప్టెంబర్‌లో నేపాల్‌లో పరిస్థితి ఒక్కసారిగా ముదిరింది. సోషల్ మీడియాపై నిషేధం విధించడం, దేశంలోని అవినీతి పెర‌గ‌డం యువతను ఆగ్రహానికి గురి చేసింది. జెన్-జెడ్ తరం వీధుల్లోకి వచ్చి ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం ప్రారంభించింది. 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడంతో ఆందోళన మరింత ఉధృతమైంది. తీవ్ర ఒత్తిడిని తట్టుకోలేక ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. ఆయన కేవలం 14 నెలల క్రితమే అధికారంలోకి వచ్చారు. పార్లమెంట్‌పై దాడులు, రాజకీయ నేతల ఇళ్లకు నిప్పంటించడం వంటి ఘటనలు కాఠ్మాండూను కలవరపరిచాయి. ప్రజాగ్రహంతో ఏకంగా ఆ దేశ ప్రధాని మారిపోయాడు. శనివారం నేపాల్‌ తాత్కాలిక ప్రధానమంత్రిగా సుశీలా కర్కి బాధ్యతలు స్వీకరించారు.

Related Articles

Related image1
Astrology: దేవీ న‌వ‌రాత్రుల వేళ‌.. ఈ రెండు రాశుల వారికి ఊహించ‌ని లాభాలు. డ‌బ్బే డ‌బ్బు..
Related image2
Liquor policy: బీరు తాగే వ‌య‌సును త‌గ్గించిన‌ ప్ర‌భుత్వం.. ఎవ‌రు తాగొచ్చంటే
38
మోదీ లాంటి నాయకుడు కావాలంటున్న నేపాల్ యువత
Image Credit : ANI

మోదీ లాంటి నాయకుడు కావాలంటున్న నేపాల్ యువత

ఇదిలా ఉంటే తమ దేశానికి మోదీ లాంటి బలమైన నాయకత్వం కావాలని నేపాల్ యువత కోరుతోంది. దేశాన్ని ఏకతాటిపై నడిపించే డైనమిక్ ప్రైమ్ మినిస్టర్ అవసరం అని అభిప్రాయపడుతున్నారు. అవినీతి లేని కొత్త నాయకులు ముందుకు రావాలని అంటున్నారు. ఇది కేవలం ప్రభుత్వ మార్పు కాదు, తరతరాలుగా మూలపదంగా ఉన్న రాజకీయ వ్యవస్థపై తిరుగుబాటు అంటూ అక్కడి యువత పిలుపునిస్తున్నారు.

48
శ్రీలంకలోనూ ఇదే పరిస్థితి
Image Credit : Narendra Modi x Account

శ్రీలంకలోనూ ఇదే పరిస్థితి

2022లో శ్రీలంకలో భారీ ఆర్థిక సంక్షోభం తలెత్తింది. చైనా నుంచి తీసుకున్న రుణాలు, హంబంటోటా పోర్ట్‌ను 99 ఏళ్ల లీజుకు ఇవ్వడం, ప్రభుత్వ అవినీతి ఇవన్నీ కలిపి దేశం దివాలా తీసేలా చేశాయి. ప్రజలు వీధుల్లోకి వచ్చి ఉద్యమం చేపట్టారు. చివరికి అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే దేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో శ్రీలంకకు భారత్ అండగా నిలిచింది. ఇంధనం, ఆహారం, ఔషధాలు అత్యవసరంగా అందించింది. చైనా మాత్రం మాటలకే పరిమితమైంది.

58
బంగ్లాదేశ్‌లో షేక్ హ‌సీనా ప‌త‌నం
Image Credit : Getty

బంగ్లాదేశ్‌లో షేక్ హ‌సీనా ప‌త‌నం

2024లో బంగ్లాదేశ్ రాజకీయాలు తలకిందులయ్యాయి. షేక్ హసీనా పదేళ్లకు పైగా అధికారంలో ఉన్నా, అవినీతి, నియంత్రణ రహిత విధానాలపై ప్రజల ఆగ్రహం ఉప్పొంగింది. ఆందోళనకారులు ప్రభుత్వ భవనాలను ముట్టడించారు. చివరికి సైన్యం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. భారత్ హసీనా ప్రభుత్వానికి మిత్రదేశం. ఆమె ప‌ద‌వి కోల్పోవ‌డంతో కొత్త తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. దీంతో భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు క్షీణించాయి.

68
భార‌త్‌పై నేపాల్ ప్ర‌భావం
Image Credit : ANI

భార‌త్‌పై నేపాల్ ప్ర‌భావం

నేపాల్‌లో నెల‌కొన్న ప‌రిస్థితులు భార‌త్‌పై నేరుగా ప్ర‌భావాన్ని చూపుతాయి. దీనికి కార‌ణాలు..

* 1,750 కిలోమీటర్ల పొడవైన ఓపెన్ బోర్డర్

* కుటుంబ, మత, సాంస్కృతిక బంధాలు

* నేపాల్ ఆర్థికంగా భారత్ ఎగుమతులపై ఆధారపడటం (చమురు, ఆహారం)

నేపాల్ అస్థిరత అంటే భారత్‌కు నేరుగా భద్రతా సవాల్‌గా మారుతుంది. చైనా ప్రభావం పెరగడం కూడా మరో ఆందోళన. చైనా వెస్టర్న్ థియేటర్ కమాండ్ నేపాల్ వెంబడి ఉండడం భారత్ వ్యూహాత్మకంగా అప్రమత్తంగా ఉండేలా చేస్తోంది.

78
భార‌త్ ముందున్న స‌వాళ్లు
Image Credit : Asianet News

భార‌త్ ముందున్న స‌వాళ్లు

భారత్ ఇప్పుడు ఒక క్లిష్ట ప‌రిస్థితుల్లో ఉంది. పాకిస్థాన్‌తో ఎలాగో సంబంధాలు బాగా లేవు. కాగా బంగ్లాదేశ్‌లో ఏర్ప‌డ్డ కొత్త ప్ర‌భుత్వంతో కూడా ఢిల్లీకి అంత‌లా సాన్నిహిత్యం లేదు. అదే విధంగా శ్రీలంక‌లో చైనా ప్ర‌భావం ఇంకా కొన‌సాగుతూనే ఉంది. వీటితో పాటు తాజాగా నేపాల్‌లో ఏర్ప‌డ్డ కొత్త ప్ర‌భుత్వం భార‌త్‌తో ఎలాంటి స‌త్సంబంధాలు క‌లిగి ఉంటుంద‌న్న అనుమానాలు ఉన్నాయి.

88
భార‌త్ ఏం చేయాలి.?
Image Credit : Asianet News

భార‌త్ ఏం చేయాలి.?

చుట్టూ ఉన్న దేశాల‌తో దౌత్య చర్చలు జ‌ర‌పాలి. సరిహద్దు భద్రత కఠినంగా పర్యవేక్షించాలి. వీటితో పాటు చైనా ప్రభావాన్ని సమతుల్యం చేసే వ్యూహాత్మక ప్రాజెక్టులు చేప‌ట్టాలి. భారత్ ఎంత బలమైన ఆర్థిక, సైనిక శక్తిగా ఎదిగినా, పొరుగుదేశాలు అస్థిరంగా ఉంటే దాని ప్రభావం తప్పదు. భారత్ శాంతియుత, స్థిరమైన పరిసరాలు కోరుకుంటే, పొరుగుదేశాల సంక్షోభాలను నిర్లక్ష్యం చేయ‌కూడ‌దు. సహాయం, దౌత్యం, ఆర్థిక భాగస్వామ్యం ద్వారా మాత్రమే భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ప్రపంచం
భారత దేశం
చైనా

Latest Videos
Recommended Stories
Recommended image1
పెళ్లికి అడ్డొచ్చిన జాత‌కం, శారీర‌కంగా క‌ల‌వ‌డానికి రాలేదా.? హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు
Recommended image2
Fake Universities : ఈ విద్యాసంస్థల్లో చేరారో అంతే సంగతి.. ఆంధ్ర ప్రదేశ్ లో ఫేక్ యూనివర్సిటీల కలకలం
Recommended image3
Love Marriage: లేచిపోయి పెళ్లి చేసుకునేవాళ్లకు షాక్.. ఇకపై పేరెంట్స్‌కు చెప్పకుండా పెళ్లి కుదరదు
Related Stories
Recommended image1
Astrology: దేవీ న‌వ‌రాత్రుల వేళ‌.. ఈ రెండు రాశుల వారికి ఊహించ‌ని లాభాలు. డ‌బ్బే డ‌బ్బు..
Recommended image2
Liquor policy: బీరు తాగే వ‌య‌సును త‌గ్గించిన‌ ప్ర‌భుత్వం.. ఎవ‌రు తాగొచ్చంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved