MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Liquor policy: బీరు తాగే వ‌య‌సును త‌గ్గించిన‌ ప్ర‌భుత్వం.. ఎవ‌రు తాగొచ్చంటే

Liquor policy: బీరు తాగే వ‌య‌సును త‌గ్గించిన‌ ప్ర‌భుత్వం.. ఎవ‌రు తాగొచ్చంటే

Liquor policy: మ‌ద్యం విధానం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటుంద‌ని తెలిసిందే. త‌క్కువ వ‌య‌సున్న వారికి మ‌ద్యం అమ్మ‌కాలను నిషేధిస్తూ చ‌ట్టాలు ఉన్నాయి. అయితే తాజాగా ఓ రాష్ట్రంలో బీరు తాగే వ‌య‌సును త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. 

1 Min read
Narender Vaitla
Published : Sep 13 2025, 10:06 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బీరు తాగే వయసులో మార్పు
Image Credit : Getty

బీరు తాగే వయసులో మార్పు

దేశ రాజ‌ధాని ఢిల్లీలో 21 ఏళ్లు నిండిన యువత బీరు తాగేందుకు అనుమతి పొందనున్నారు. ఇప్పటి వరకు ఢిల్లీలో చట్టబద్ధ వయసు 25 ఏళ్లుగా ఉండగా, కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకారం దానిని తగ్గించారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం శివారు పట్టణాలకు వెళ్తున్న యువతను ఆపడం. ఇప్పటి వరకు గుర్గ్రామ్, నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్‌లలో 21 ఏళ్లకే బీర్ అనుమతించగా, ఢిల్లీలో 25 ఏళ్లుగా ఉంది. దీంతో యువ‌త శివార్ల‌కు వెళ్లి బీరు తాగుతున్నారు.

25
కొత్త విధానంతో ప్రభుత్వ ప్రణాళిక
Image Credit : our own

కొత్త విధానంతో ప్రభుత్వ ప్రణాళిక

ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వానికి మద్యం ద్వారా సుమారు రూ.8 వేల కోట్ల ఆదాయం వస్తోంది. కానీ కొత్త మార్పులతో ఈ సంఖ్య రూ.12 వేల కోట్ల వరకు చేరుతుందని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా లీగల్ ఏజ్ తగ్గించడం వల్ల మార్కెట్ విస్తరించి, ప్రభుత్వ రెవెన్యూ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

Related Articles

Related image1
Astrology: సెప్టెంబ‌ర్ 13 నుంచి అక్టోబ‌ర్ 26 వ‌ర‌కు.. ఈ 4 రాశుల వారికి క‌ష్ట‌కాలం, జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే
Related image2
TTD News: కొత్తగా పెళ్లైన వారికి తిరుమలలో ప్రత్యేక దర్శనం.? కీలక ప్రకటన చేసిన టీటీడీ అధికారులు.
35
ప్రైవేట్ షాపులకు అనుమతి అవకాశాలు
Image Credit : Getty

ప్రైవేట్ షాపులకు అనుమతి అవకాశాలు

కొత్త పాలసీలో భాగంగా ప్రైవేట్ మద్యం షాపులకు కూడా మళ్లీ అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. గతంలో ఈ ప్రయత్నం చేసినప్పుడు విమర్శలు ఎదురైనప్పటికీ, ప్రస్తుతం ఆదాయం పెంచుకోవాలనే ఉద్దేశంతో మరోసారి చర్చలు జరుగుతున్నాయి. బ్రాండెడ్ మద్యం కొరత తగ్గించడంపైనా దృష్టి సారిస్తున్నారు.

45
ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో లావాదేవీలపై దృష్టి
Image Credit : Getty

ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో లావాదేవీలపై దృష్టి

గత కొన్నేళ్లుగా ఢిల్లీ శివారు పట్టణాల్లో రూ.5 నుండి రూ.7 వేల కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయని అంచనా. ఈ వ్యాపారం స్థానిక ప్రభుత్వాలకు లాభం చేకూర్చినా, ఢిల్లీకి నష్టం కలిగించింది. కొత్త విధానం ద్వారా ఆ లావాదేవీలను ఢిల్లీకే మళ్లించాలన్నది ప్రభుత్వ వ్యూహం.

55
భవిష్యత్తులో తీసుకోబోయే చర్యలు
Image Credit : Getty

భవిష్యత్తులో తీసుకోబోయే చర్యలు

కొత్త పాలసీని మరో మూడు నుంచి నాలుగు నెలల్లో పూర్తి చేయాలని ఎక్సైజ్ కమిటీ ప్రణాళిక వేసింది. స్కూల్స్, ఆసుపత్రులు, నివాస సముదాయాల నుంచి దూరంగా మద్యం దుకాణాలు ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. అదనంగా, షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లలో మద్యం విక్రయాలకు అవకాశం కల్పించనున్నారు.

About the Author

NV
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు.
భారత దేశం
జీవనశైలి
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved