MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • National
  • IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !

Railways Ticket Price Hike : రైల్వే ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. డిసెంబర్ 26 నుంచి ట్రైన్ టికెట్ ధరలు పెరుగుతున్నాయి. ఎవరికి ఎంత భారం పడుతుందో, ఏ క్లాస్‌కు ఎంత పెంపు ఉందో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Dec 21 2025, 10:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
రైల్వే ప్రయాణికులకు షాక్: డిసెంబర్ 26 నుంచి టికెట్ ధరలు పెంపు
Image Credit : Gemini

రైల్వే ప్రయాణికులకు షాక్: డిసెంబర్ 26 నుంచి టికెట్ ధరలు పెంపు

సామాన్యుడి విమానంగా పేరుగాంచిన భారతీయ రైల్వే తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ట్రైన్ టికెట్ ధరలను పెంచుతూ చేసిన ప్రకటన ప్రయాణికులను షాక్ కు గురి చేసింది. ఈ కొత్త ధరలు ఈ ఏడాది డిసెంబర్ 26 నుంచి అమల్లోకి రానున్నాయి. పెరుగుతున్న నిర్వహణ ఖర్చులను సమతుల్యం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామని రైల్వే అధికారులు చెబుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఏ క్లాస్‌కు ఎంత పెరుగుతుందంటే?
Image Credit : X

ఏ క్లాస్‌కు ఎంత పెరుగుతుందంటే?

రైల్వే ప్రకటించిన తాజా ఫేర్ స్ట్రక్చర్ ప్రకారం, అందరు ప్రయాణికులపై ఒకేలా భారం పడదు.

  • 215 కిలోమీటర్ల లోపు ప్రయాణం: ఎలాంటి ధరల పెంపు లేదు.
  • ఆర్డినరీ / జనరల్ క్లాస్ (215 కి.మీ పైగా): ప్రతి కిలోమీటరుకు 1 పైసా అదనంగా చెల్లించాలి.
  • మెయిల్/ఎక్స్‌ప్రెస్ (నాన్-ఏసీ, ఏసీ): ప్రతి కిలోమీటరుకు 2 పైసలు అదనంగా వసూలు చేస్తారు.

ఉదాహరణకు, నాన్-ఏసీ లేదా ఏసీ కోచ్‌లో 500 కిలోమీటర్లు ప్రయాణిస్తే, ప్రస్తుతం ఉన్న టికెట్ ధరపై రూ.10 మాత్రమే అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

Related Articles

Related image1
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !
Related image2
Most Expensive Vegetables : కిలో రూ.1 లక్ష .. భారత్‌లో అత్యంత ఖరీదైన కూరగాయలు ఇవే
36
రైల్వే టికెట్ ధరలు: సామాన్యులకు ఊరట ఇచ్చిన అంశాలు ఏంటి?
Image Credit : Getty

రైల్వే టికెట్ ధరలు: సామాన్యులకు ఊరట ఇచ్చిన అంశాలు ఏంటి?

టికెట్ ధరల పెంపు ఉన్నప్పటికీ, కొన్ని వర్గాలకు రైల్వే ఊరట కల్పించింది. సబర్బన్ ట్రైన్స్, లోకల్ రైళ్లు, మంత్లీ సీజన్ టికెట్లు (MST), తక్కువ దూర ప్రయాణాల ధరల్లో పెరుగుదల లేదు.

హైదరాబాద్, ముంబయి, కోల్‌కతా, ఢిల్లీ వంటి మహానగరాల్లో రోజూ లోకల్ ట్రైన్లపై ఆధారపడే లక్షలాది మందిపై ఈసారి ఎలాంటి అదనపు భారం పడలేదు.

46
రైల్వే టికెట్ ధరలు పెంచడానికి అసలు కారణాలేంటి?
Image Credit : Getty

రైల్వే టికెట్ ధరలు పెంచడానికి అసలు కారణాలేంటి?

గత దశాబ్ద కాలంలో రైల్వే నెట్‌వర్క్ విస్తరణ భారీగా జరిగింది. దీనికి అనుగుణంగా నిర్వహణ ఖర్చులు కూడా పెరిగాయి.

  • 2024–25 ఆర్థిక సంవత్సరం మొత్తం వ్యయం: రూ.2,63,000 కోట్లు
  • మానవ వనరుల ఖర్చు: రూ.1.15 లక్షల కోట్లు
  • పెన్షన్ వ్యయం: రూ.60,000 కోట్లు

అదనంగా భద్రత, ఆధునీకరణ, ప్రత్యేక రైళ్ల నిర్వహణ వంటి అంశాలు కూడా వ్యయాన్ని పెంచాయని అధికారులు వివరించారు. ఈ పరిస్థితుల్లో ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయాణికుల టికెట్ ధరల్లో స్వల్ప సవరణ తప్పనిసరైందని రైల్వే చెబుతోంది.

56
ముందే బుక్ చేసుకున్న టికెట్ల పరిస్థితి ఏంటి?
Image Credit : Getty

ముందే బుక్ చేసుకున్న టికెట్ల పరిస్థితి ఏంటి?

డిసెంబర్ 26కి ముందు బుక్ చేసుకున్న టికెట్లపై కొత్త ధరలు వర్తిస్తాయా? అనే సందేహాలు ఉన్నాయి. గత అనుభవాలను బట్టి చూస్తే, టికెట్ బుక్ చేసిన తేదీ నాటి చార్జీలే వర్తించే అవకాశం ఎక్కువ. అయితే దీనిపై అధికారిక సర్క్యులర్ రావాల్సి ఉంది.

ఇదే సమయంలో ప్రయాణికులకు మరో శుభవార్త కూడా ఉంది. ఇకపై రైలు బయల్దేరే 10 గంటల ముందే రిజర్వేషన్ చార్ట్ సిద్ధం చేయనున్నారు. దీని వల్ల వెయిటింగ్ లిస్టులో ఉన్నవారికి ముందుగానే స్పష్టత లభించి ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేసుకునే అవకాశం ఉంటుంది.

టికెట్ ధరల పెంపు కొంతమేర భారం అయినప్పటికీ, అది చాలా స్వల్పమని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. భద్రత, సేవల మెరుగుదల, నెట్‌వర్క్ విస్తరణ కోసం ఈ నిర్ణయం కీలకమని స్పష్టం చేశాయి.

66
తెలుగు రాష్ట్రాల ప్రయాణికులపై ప్రభావం ఇలా..
Image Credit : Getty

తెలుగు రాష్ట్రాల ప్రయాణికులపై ప్రభావం ఇలా..

తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన మార్గాలైన హైదరాబాద్ నుంచి తిరుపతి, విశాఖపట్నం వెళ్లే వారిపై ఈ పెంపు ప్రభావం ఎలా ఉంటుందో కింది అంచనాల ద్వారా తెలుసుకోవచ్చు:

1. హైదరాబాద్ - తిరుపతి (సుమారు 660 కి.మీ): 

జనరల్ టికెట్: 215 కి.మీ మినహాయింపు పోను, మిగిలిన 445 కిలోమీటర్లకు (445 x 1 పైసా) సుమారు రూ. 4.50 పెరుగుతుంది.

స్లీపర్/ఏసీ: మొత్తం దూరానికి (660 x 2 పైసలు) రూ. 13.20 వరకు అదనంగా చెల్లించాల్సి వస్తుంది.

2. హైదరాబాద్ - విశాఖపట్నం (సుమారు 700 కి.మీ):

జనరల్ టికెట్: 215 కి.మీ మినహాయింపు పోను, మిగిలిన 485 కిలోమీటర్లకు రూ. 5 వరకు పెరుగుతుంది.

స్లీపర్/ఏసీ: మొత్తం దూరానికి (700 x 2 పైసలు) సుమారు రూ. 14 వరకు టికెట్ ధర పెరిగే అవకాశం ఉంది.

గమనిక: ఇవి అంచనాలు మాత్రమే అసలైన ధరల పూర్తి వివరాలు రైల్వే వెల్లడిస్తుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ప్రయాణం
భారత దేశం
హైదరాబాద్
తిరుపతి
విశాఖపట్నం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
నేపాల్ వరదల్లో గల్లంతైన ప్రాణ స్నేహితులు కన్నీరు పెట్టుకున్న విద్యార్ధి| Friends Missing Nepal Flood
Recommended image2
Now Playing
నేపాల్ లో పర్యటించిన సోనూసూద్ అక్కడి పరిస్థితి చూసి ఎమోషనల్ | Sonu Sood Visits Flood-Hit Nepal
Recommended image3
Now Playing
Nepal Flash Floods: ప్రస్తుతం నేపాల్ పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు | Rescue Operations Continue
Related Stories
Recommended image1
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !
Recommended image2
Most Expensive Vegetables : కిలో రూ.1 లక్ష .. భారత్‌లో అత్యంత ఖరీదైన కూరగాయలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved