MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • ఈ 5 రకాల ఫుడ్స్ మళ్లీ మళ్లీ వేడి చేసి తింటే అంతే.. రోగాలు కొని తెచ్చుకున్నట్టే

ఈ 5 రకాల ఫుడ్స్ మళ్లీ మళ్లీ వేడి చేసి తింటే అంతే.. రోగాలు కొని తెచ్చుకున్నట్టే

ఫుడ్ వేస్ట్ చేయకూడదని మధ్యాహ్నం ఎప్పుడో వండిన కూర, రైస్ రాత్రి వేడి చేసి తింటుంటారు. ఇది ఎంత మాత్రం మంచిది కాదని, ముఖ్యంగా కొన్ని పదార్థాలను మళ్లీ మళ్లీ వేడి చేసి తింటే రోగాలు కొని తెచ్చుకున్నట్టేనని డాక్టర్లు చెబుతున్నారు. పదే పదే వేడి చేయకూడని 5 రకాలు ఫుడ్ ఐటమ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.  

2 Min read
Naga Surya Phani Kumar
Published : May 04 2025, 07:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

టీ, కాఫీని మళ్లీ మళ్లీ వేడిచేయకూడదు

మన ఇంటికి చుట్టాలు, స్నేహితులు వచ్చారనుకోండి వెంటనే వారికి టీ, కాఫీ ఇస్తుంటాం కదా. కాని ఒక్కోసారి పొద్దున్న ఎప్పుడో పెట్టిన టీ మిగిలిపోయి ఉంటుంది. దాన్ని కాస్త వేడి చేసి సర్వ్ చేసేస్తుంటారు. అలాగే టీ దుకాణాల్లో కూడా ఎప్పుడో పెట్టిన టీని పదే పదే వేడి చేసి ఇస్తుంటారు. ఎంత టేస్టీగా ఉందో అనుకుంటూ తాగేస్తుంటాం. కాని వాస్తవానికి పదే పదే వేడి చేసే టీ, కాఫీల్లో పోషకాలన్నీ ఆవిరైపోతాయట. టీ ఆకుల్లో, కాఫీ గింజల్లో ఉండే రుచి కూడా మారిపోతుంది. అంతేకాకుండా హానికరమైన బ్యాక్టీరియా తయారై శరీరంలోకి చేరి అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. 

25

బంగాళాదుంపలతో వికారం, వాంతులు

బంగాళాదుంపలను కూడా పదేపదే వేడి చేసి తినడం మంచిది కాదు. పొద్దున్న మిగిలిపోయిందని, సాయంత్రం పూట వేడిగా ఉండాలని కొందరు కూరలను మళ్లీ వేడిచేస్తుంటారు. ఇలాంటి వాటిలో బంగాళా దుంప కూర ఉంటే అస్సలు వేడి చేయకూడదు. దీని వల్ల బంగాళాదుంపలో ఉండే నైట్రేట్స్ శరీరానికి బలం ఇవ్వకపోగా, అనేక ఆరోగ్య సమస్యలు తెస్తాయి. పదే పదే వేడి చేసిన బంగాళాదుంపలు తింటే వికారం, వాంతులు వచ్చే అవకాశం ఉంటుంది. 

Related Articles

Related image1
20 నిమిషాల్లో తయారు చేసే సింపుల్ బ్రేక్‌ఫాస్ట్‌ ఐటమ్స్
Related image2
వామ్మో.. వాటర్ బాటిల్ మూత రంగులో ఇంతర్థం ఉందా? ఏ కలర్ మూత ఉన్న వాటర్ తాగితే మంచిదో తెలుసా?
35

కోడి గుడ్డుతో ఎసిడిటీ, ఉబ్బరం

ఎక్కువ వినియోగించే నాన్ వెజ్ లో కోడి గుడ్డు ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. ఫ్రై అంటే అప్పటికప్పుడు కోడిగుడ్డు పగలగొట్టి వేస్తారు కాని.. బిర్యానీలు, కర్రీలకైతే బాయిల్ చేసిన ఎగ్స్ ని ఎక్కువగా వాడతారు. అయితే బాయిల్ చేసిన ఎగ్స్ ని పదేపదే వేడి చేసి తింటే కడుపు ఉబ్బరం, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. 
 

45

పాలకూరతో డేంజర్

పాలకూరలో చాలా పోషకాలు ఉంటాయి. అందుకే పాలకూరను తరచూ కూరల్లో ఉపయోగిస్తారు. పాలకూర పప్పు, వేపుడు, పాలక్ పన్నీర్ కర్రీ ఇలా రకరకాలుగా తయారు చేస్తారు. అయితే పదే పదే వేడి చేయడం వల్ల అందులో ఉండే నైట్రేట్స్ విషపూరితమైపోతాయి. నైట్రేట్స్ కడుపులో ఉండే అమినో యాసిడ్స్ తో కలిసి క్యాన్సర్ కారకాలుగా మారే ప్రమాదం ఉంది. 

55

మష్రూమ్స్ తో గుండె జబ్బులు..

మష్రూమ్స్ లో ఎన్ని పోషకాలు ఉంటాయో, వాటిని సరిగ్గా ఉపయోగించపోతే అంతటి ప్రమాదాన్ని కూడా తెస్తాయి. మష్రూమ్స్ ను ఎక్కువగా రెస్టారెంట్స్, దాబాల్లో వినియోగించడం చూస్తుంటాం. అయితే వాటిని పదేపదే వేడి చేయడం వల్ల తెల్లగా ఉండేవి కాస్తా రంగు మారిపోతాయి. రుచి కూడా మారిపోయి కడుపులో బ్యాక్టీరియా పెరిగిపోతుంది. తిన్న ఆహారం డైజస్ట్ కాకపోవడం లాంటి సమస్యలతో పాటు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved