- Home
- Entertainment
- Chandra Mohan: ఆ స్టార్ కొడుకు పచ్చి తాగుబోతు, తండ్రి మిగిల్చిన మందు తాగుతూ..అందుకే నా కూతుళ్ళని దూరంగా ఉంచా
Chandra Mohan: ఆ స్టార్ కొడుకు పచ్చి తాగుబోతు, తండ్రి మిగిల్చిన మందు తాగుతూ..అందుకే నా కూతుళ్ళని దూరంగా ఉంచా
నటుడు చంద్ర మోహన్ తెలుగు చిత్ర పరిశ్రమలో వెలుగు వెలిగిన కొందరు లెజెండ్రీ నటుల చివరి రోజుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చాలా మంది ఆర్థిక సమస్యలతో చివరి రోజుల్లో దుర్భర జీవితం గడిపినట్లు తెలిపారు.

Chandra Mohan
టాలీవుడ్ లో చంద్రమోహన్ లెజెండ్రీ నటుడే అని చెప్పొచ్చు. చంద్రమోహన్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని వందల చిత్రాల్లో నటించారు. శ్రీదేవి, జయసుధ, జయప్రద లాంటి స్టార్ హీరోయిన్లతో చంద్రమోహన్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. చంద్రమోహన్ కేవలం హీరో పాత్రలకే పరిమితం కాకుండా తన లిమిట్స్ తాను అర్థం చేసుకుంటూ వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు.
వ్యసనాలతో నా కళ్ళ ముందే పాడైపోయారు
ఆర్థికంగా లైఫ్ లో నిలదొక్కుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో చంద్రమోహన్ ఇండస్ట్రీలో చెడు వ్యసనాల వల్ల జీవితం నాశనం చేసుకుని ఆర్థికంగా దుర్భర స్థితిని అనుభవించిన నటీనటుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్ర మోహన్ మాట్లాడుతూ.. నటులుగా ఎంతో గొప్ప కీర్తి సొంతం చేసుకున్న చాలా మంది వ్యసనాల కారణంగా ఇబ్బంది పడ్డారు. మరికొందరు వారి సంతానం వల్ల ఇబ్బంది పడ్డారు. ఎస్వీ రంగారావు, హరనాథ్, నాగభూషణం, రేలంగి ఇలాంటి వారంతా ఆ కోవకు చెందిన వారే. తగేవారు కొందరు, జూదం, రేసులు ఆడేవారు కొందరు.. మహిళల వ్యామోహం కొందరికి ఇలా రకరకాల వ్యసనాలతో నా కళ్ళ ముందే పాడైపోయినోళ్లు ఉన్నారు. కొందరు సినిమా నిర్మాణం పేరుతో విచ్చల విడిగా డబ్బు ఖర్చు పెట్టి చెడిపోయారు. నాగభూషణం ఎంత గొప్ప ఆర్టిస్ట్ ? ఆయన ఎన్ని ఆస్తులు సంపాదించారో నాకు తెలుసు.
గోల్డెన్ స్పూన్ తో పెంచారు
కానీ చివరికి ఒక్కటి కూడా మిగల్లేదు. మొత్తం పోగొట్టుకుని హైదరాబాద్ గాంధీనగర్ లో తన భార్యతో ఓ అవుట్ హౌస్ లో దుర్భర జీవితం గడిపారు. వీళ్లంతా చేసిన పొరపాటు ఏంటంటే వాళ్ళ పిల్లలని సరిగ్గా పెంచలేదు. గోల్డెన్ స్పూన్ తో పెంచారు. దీనితో వారి పిల్లలు పెద్దయ్యాక ఇంకా ఎక్కువ లగ్జరీలు, వ్యసనాలకు అలవాటు పడ్డారు అని చంద్ర మోహన్ తెలిపారు. అందరూ పండిత పుత్రులే.
ఆ స్టార్ కొడుకు పచ్చి తాగుబోతు
రాజనాల కూతురు, హరనాథ్ కూతురు, ఎస్వీ రంగారావు కొడుకు వీళ్లంతా విచ్చల విడితనం వల్ల చెడిపోయారు అని చంద్రమోహన్ తెలిపారు. ఎస్వీ రంగారావు కొడుకు ఎలాంటి వాడు అంటే.. తండ్రి తాగగా మిగిలిన మందుని తాగేసేవాడు. తాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోయేవాడు. 14 ఏళ్ళ నుంచే షూటింగ్ లొకేషన్స్ లో మా దగ్గరకు వచ్చి అంకుల్ డబ్బులు ఇవ్వండి అని అడిగేవాడు.
నా కూతుళ్ళని అందుకే దూరంగా ఉంచా
రేలంగి కొడుకు కూడా వ్యసనాలతో సర్వనాశనం అయ్యాడు. వీళ్లందరి జీవితాలు చూసినప్పుడు నాకు ఒకటే అనిపించింది. మనకి క్రేజ్ ఉన్నప్పుడే డబ్బులు సంపాదించి జాగ్రత్తగా దాచుకోవాలి. లైఫ్ లో ఆర్థికంగా మినిమమ్ సెక్యూరిటీ ఉండాలి. అదృష్టం కొద్దీ నాకు ఇద్దరు ఆడపిల్లలు. వాళ్లపై సినిమా ప్రభావమే పడనివ్వలేదు నేను. మా అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు. చిన్నప్పటి నుంచే చైల్డ్ ఆర్టిస్ట్ గా పంపించండి అని అడిగేవాళ్ళు. నేను చేతులెత్తి నమస్కారం పెట్టి పంపించేసేవాడిని. నా పిల్లలని ఇండస్ట్రీకి దూరంగా పెంచినట్లు చంద్రమోహన్ తెలిపారు.

