ఇక ఖుషి సినిమాపై దృష్టి పెట్టిన విజయ్ దేవరకొండ, నెక్ట్స్ ప్లాన్ ఏంటంటే..?
పాపం విజయ్ దేవరకొండ ఏదో అనుకుంటే.. ఏదో జరిగిపోయింది. పాన్ ఇండియా రేంజ్ లో రారాజుగా వెలుగు వెలగాలని అనుకన్నాడు. కాని ఫలితం దెబ్బకొట్టింది. అందుకే నెక్ట్స్ సినిమాలపై ఫోకస్ పెంచాడట యంగ్ హీరో.
లైగర్ సినిమా ఫలితం రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో పాటు.. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో పాటు యూనిట్ మొత్తాన్ని తీవ్ర నిరాశకు గురి చేసింది. లైగర్ పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ అయితే.. విజయ్ ఓ రేంజ్ కి వెళ్లిపోయేవాడు. బాలీవుడ్ కు కింగ్ అయ్యేవాడు. కానీ బ్యాడ్ లక్ లైగర్ రిజల్ట్ మరోలా వచ్చింది. ఇక ఈ ఫెయిల్యూర్ వెయిట్ ను మోయలేక పోతున్నా కాని.. బయటకు మాత్రం చిరునవ్వుతో కనిపిస్తున్నాడు రౌడీ హీరో విజయ్. ప్రస్తుతం క్రికెట్ అంటూ...బయటకు వెళ్ళి.. అటూ ఇటూ తిరుగుతూ.. మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు.
ఇక ఈ నిరాశ నుంచి బయట పడేందుకు విజయ్ దేవరకొండ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా తన నెక్ట్స్ సినిమాల పైన గట్టిగా ఫోకస్ చేయాలని డిసైడ్ అయ్యాడట. అందులో బాగంగా నెక్ట్స్ మూవీ ఖుషి పై పూర్తిగా ఫోకస్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే తను పక్కా ప్లాన్ ప్రకారం వెళ్ళబోతున్నాడట. సినిమాకు ముందే హడావిడి కాని.. తన మార్క్ మాటల హడావిడి లేకుండా చూసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడట విజయ్. ఈసారి ఎలాగైన హిట్ కొట్టి.. ఫెయిల్యూర్ రివేంజ్ తీర్చుకోవాలి అని చూస్తున్నాట.
ముందుగా అనుకున్న ప్రకారం ఈ సినిమాకు సంబంధించి దుబాయ్ లో జరిగే రెండు రోజుల ఈవెంట్ కు విజయ్ హాజరు అవుతున్నారు. ప్రస్తుతం దుబాయ్ లో ఆయన సందడి చేస్తున్నాడు. అక్కడ జరిగిన క్రికెట్ మ్యాచ్ లో కూడా విజయ్ సందడి చేశారు. ఇక ఆ తర్వాత ఖుషి రెగ్యులర్ షూటింగ్ లో ఆయన పాల్గొనబోతున్నాడు. ఈ సినిమాలో విజయ్ సరసన సమంత నటిస్తోంది. లైగర్ డిజప్పాయింట్ చేసింది. అంతకు ముందు కూడా రెండ సినిమాలు ప్లాప్ లే. దాంతో ఈ నేపథ్యంలో, విజయ్ కు ఇప్పుడు ఒక మంచి హిట్ సినిమా కావాలి. అందుకే అన్నింటిని పక్కన పెట్టి ఖుషి సినిమాపై ఫోకస్ పెంచాలని నిర్ణయించుకున్నాడు.