హైదరాబాద్ను వీడిన రాజమౌళి, భయంతోనేనా?
రాబోయే రెండు నెలల్లో కేసులు పెరుగుతాయనే అంచనాల మధ్య చాలా మంది సొంతూళ్లకు వెళ్లిపోయారు. మరికొందరు ఇళ్లల్లోనే బయిటకు రాకుండా ఉంటున్నారు.గ్రేటర్ హైదరాబాద్లో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జనాలు భయపడుతున్నారు. ఈ క్రమంలో రాజమౌళి కూడా తన మకాం ఫామ్ హౌస్ కు మార్చేసాడనే వార్తలు మీడియాలో గుప్పుమన్నాయి.
భాగ్యనగరంపై కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. కరోనా వైరస్ కారణంగా హైదరాబాద్ ఖాళీ అవుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్లో రద్దీగా ఉండే ప్రాంతాలన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. రాబోయే రెండు నెలల్లో కేసులు పెరుగుతాయనే అంచనాల మధ్య చాలా మంది సొంతూళ్లకు వెళ్లిపోయారు. మరికొందరు ఇళ్లల్లోనే బయిటకు రాకుండా ఉంటున్నారు.గ్రేటర్ హైదరాబాద్లో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జనాలు భయపడుతున్నారు. ఈ క్రమంలో రాజమౌళి కూడా తన మకాం ఫామ్ హౌస్ కు మార్చేసాడనే వార్తలు మీడియాలో గుప్పుమన్నాయి. అందుకు కారణం రాజమౌళి ప్రస్తుత పరిస్దితులు చూసి భయపడటమే అని వార్తలు వస్తున్నాయి. అందులో నిజమెంత
ఇన్నాళ్ళూ కరోనా ప్రభావంతో ...ఇంటికే పరిమితమైన రాజమౌళి, ఆర్ ఆర్ ఆర్ టీం… లాక్ డౌన్ సడలింపుల తర్వాత షూటింగ్ లకు అనుమతి రావటంతో తిరిగి పని ప్రారంభించాలనుకున్నారు. ప్రభుత్వంతో చర్చల సందర్భంగా రాజమౌళి యాక్టివ్ గా ఉన్నారు. కానీ ప్రభుత్వ నిబంధనలు, కరోనా విజృంభణ తర్వాత షూటింగ్ ను నిరవధికంగా వాయిదా వేసుకున్నారు.
వాస్తవానికి ఆర్ ఆర్ ఆర్ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ పుణేలో చేయాల్సి ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ షూటింగ్ సాధ్యమయ్యే పని కాదు. దీంతో నల్గొండ జిల్లాలో షూటింగ్ అనుకూల పరిస్థితులు ఉన్నాయని, అక్కడే షూటింగ్ చేయాలని రాజమౌళి భావిస్తున్నట్లు వార్తలొచ్చాయి.
ఈ నేపధ్యంలో రాజమౌళి తన కుటుంబంతో కలిసి నార్కట్ పల్లికి షిఫ్ట్ అయిటనట్లు తెలుస్తోంది. అక్కడ తన ఫాంహౌజ్ కు షిఫ్ట్ అయి, అక్కడి నుండే కొత్త సినిమా స్క్రిప్టు పనులను మొదలుపెట్టబోతున్నారట. `ఆర్ఆర్ఆర్` పనులను తాత్కాలికంగా పక్కనపెట్టి తన తర్వాతి సినిమా స్క్రిప్టు పనులను ప్రారంభించబోతున్నారట. పైగా హైదరాబాద్ లోనూ కేసులు అధికంగా ఉన్న నేపథ్యంలో ఎలా చూసిన ఇదే బెస్ట్ అని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మీడియా వర్గాల్లో చర్చ సాగుతోంది.